బడా నేతలకి ఎర్త్ పెట్టిన లేడీ సింగర్!

బాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ పాడే కనికా కపూర్ యునైటెడ్ కింగ్డమ్ నుంచి కరోనా టైములో ప్రయాణించి వచ్చింది. ఎయిర్ పోర్టులో చెకింగ్ అధికారులకి దొరికితే తనని నిర్బంధిస్తారని భయపడి దొరక్కుండా తప్పించుకుంది. కనీసం ఇంట్లోంచి అయినా బయటకి రాకుండా ఉండకుండా పార్టీలకి హాజరైంది.

మినిస్టర్లతో పాటు కొందరు సెలెబ్రిటీలు హాజరయిన ఆ పార్టీ తీగ లాగితే డొంకంతా కదులుతోంది. ఆ పార్టీకి వెళ్లిన మినిస్టర్ ఒకరు మర్నాడు భారత రాష్ట్రపతి ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ కి హాజరు అవడంతో ఇప్పుడు అంతటా హై అలెర్ట్ నెలకొంది. రాష్ట్రపతితో సహా చాలా మంది మంత్రులని క్వారంటైన్ లో ఉంచాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంతా చేసి కనిక కాస్తయినా పశ్చాత్తాపం చూపించడం లేదు.

ఆమె తండ్రి ఏమో ఆమె మూడు పార్టీలకి హాజరు అయిందని న్యూస్ ఛానల్ కి చెప్పారు. కానీ కనిక ఆ ఒక్క పార్టీకే వెళ్లినట్టు నొక్కి వక్కాణిస్తోంది. ఏదేమైనా ఇన్నేళ్ళలో ఎన్ని పాటలు పాడినా రాని గుర్తింపు ఆమెకి ఈ ఒక్క సంఘటనతో వచ్చింది.