మరో క్రేజీ బయోపిక్ లో కీర్తిసురేష్

మహానటి సావిత్రి బయోపిక్ లో నటించిన కీర్తిసురేష్ కు అలాంటిదే మరో క్రేజీ బయోపిక్ ఆఫర్ రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై కీర్తిసురేష్ కూడా చిన్న హింట్ ఇచ్చింది. త్వరలోనే తమిళనాట ఓ బయోపిక్ లో నటించబోతున్నానని, ఆ వివరాలు మహానటి రిలీజ్ తర్వాత వెల్లడిస్తానని అంటోంది.

తాజా సమాచారం ప్రకారం, జయలలిత బయోపిక్ లో కీర్తిసురేష్ నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మేరకు కొంతమంది తమిళ మేకర్స్ ఆమెతో చర్చలు జరుపుతున్నారు. కీర్తిసురేష్ ఒప్పుకుంటే, ప్రాజెక్టు సెట్ అయినట్టే. తమిళ-తెలుగు భాషల్లో ఒకేసారి ప్రాజెక్టును సెట్స్ పైకి తెస్తారు.

సినిమాల్లో ఓ వెలుగువెలిగి, తర్వాత తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశించారు జయలలిత. ఒక దశలో రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగారు. కేవలం జయలలిత సీన్ లో ఉన్నారు కాబట్టే రజనీకాంత్ లాంటి స్టార్ కూడా రాజకీయాల ఊసెత్తలేదనే టాక్ ఉంది. సో.. ఈ బయోపిక్ కచ్చితంగా తమిళనాట ప్రకంపనలు సృష్టించడం ఖాయం.

జయలలిత బయోపిక్ లో శోభన్ బాబు, ఎన్టీఆర్, రజనీకాంత్, ఎంజీఆర్, కరుణానిధి లాంటి ప్రముఖులు కూడా ఉంటారు. ఆమె ఎలా చనిపోయిందనే అంశాన్ని కూడా చర్చించబోతున్నారు. మరి ఇంతటి వివాదాస్పద బయోపిక్ లో కీర్తిసురేష్ నటిస్తుందా..? వెయిట్ అండ్ సీ!