రాయ్‌ లక్ష్మీ.. వాట్‌ ఏ ఫాలోయింగ్‌.!

సినీ పరిశ్రమలో ఇన్నేళ్ళ కెరీర్‌లో తాను ఏం సాధించానో ఇప్పుడే తనకు అర్థమయ్యిందంటోంది రాయ్‌ లక్ష్మీ అలియాస్‌.. లక్ష్మీ రాయ్‌. ‘జూలీ-2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రాయ్‌ లక్ష్మీకి, వివిధ సినీ పరిశ్రమల నుంచి పలువురు ప్రముఖులు ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెబుతూ వీడియో సందేశాలు పంపిన విషయం విదితమే. టాలీవుడ్‌ నుంచి చిరంజీవి ‘లవ్‌ యూ..’ అంటూ ‘రత్తాలు’కి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ‘నా జీవితంలోనే ఇది వెరీ వెరీ స్పెషల్‌ మూమెంట్‌..’ అంటూ చిరంజీవి విషెస్‌పై రాయ్‌ లక్ష్మీ స్పందించింది.

ఇక, తమిళ సినీ పరిశ్రమ నుంచి మాధవన్‌, ఆర్య తదితరులు రాయ్‌ లక్ష్మీకి విషెస్‌ అందించారు. మరోపక్క, మలయాళ సినీ పరిశ్రమ నుంచి మమ్ముట్టి కూడా వీడియో ద్వారానే రాయ్‌ లక్ష్మీకి ‘జూలీ-2’ సినిమా విషయమై విషెస్‌ అందించడం గమనార్హం. ఓ సినిమా రిలీజ్‌కి ముందు తనకు ఇంతలా ఆయా సినీ పరిశ్రమల నుంచి ‘వీడియో సందేశాలు’ రావడం ఇదే తొలిసారి అని అంటోంది రాయ్‌ లక్ష్మీ.

ఫోన్‌లో డైరెక్ట్‌గా విషెస్‌ చేసినవారు, సోషల్‌ మీడియా వేదికగా విషెస్‌ అందసేసినవారు.. ఇలా ఇంతమంది నా మీద చూపుతోన్న అభిమానంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాననీ, వారందరి విషెస్‌ ఫలించి ‘జూలీ-2’ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని రాయ్‌ లక్ష్మీ ధీమా వ్యక్తం చేసింది.

”ఇప్పటిదాకా హీరోయిన్‌గా, ఐటమ్‌ గర్ల్‌గా సాధించిన సక్సెస్‌లన్నీ ఓ ఎత్తు.. ‘జూలీ-2’ సినిమా రిలీజ్‌కి ముందు నన్ను అభినందిస్తున్న వారి విషెస్‌ ఇంకో ఎత్తు.. ఇదీ సినీ పరిశ్రమలో నేను సాధించిన ఘనత..” అంటూ చెమర్చిన కళ్ళతో తీవ్రమైన భావోద్వేగానికి గురవుతోంది రాయ్‌ లక్ష్మీ.