వెంకీ సినిమా ఆగిపోలేదు.. సాగుతోంది!

వెంకటేష్-కిషోర్ తిరుమల కాంబినేషన్ లో ఓ సినిమా ఇప్పటికే సెట్స్ పైకి రావాల్సింది. కొన్ని క్రియేటివ్ కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయిందని ఓసారి వెంకటేష్ ప్రకటించాడు. కానీ దర్శకుడు కిషోర్ తిరుమల మాత్రం ఆ సినిమా ఆగిపోలేదంటున్నాడు. ఉన్నది ఒక్కటే జిందగీ ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన కిషోర్ తిరుమల.. వెంకీ సినిమాకు వర్క్ జరుగుతోందని ప్రకటించాడు.

“వెంకటేష్ తో సినిమా ఆగిపోలేదు. కథపై ఇంకొంచెం వర్కవుట్ చేయాల్సి ఉంది. వెంకటేష్ తో సినిమా కచ్చితంగా ఉంటుంది. ఉన్నది ఒక్కటే జందగీ రిలీజ్ తర్వాత ఏ కథతో సినిమా చేస్తే బాగుంటుందనే విషయంపై ఆలోచిస్తా. అది వెంకటేష్ సినిమానా కాదా అనేది ఇప్పుడే చెప్పలేను. వెంకటేష్ కు గతంలో కథ చెప్పిన మాట వాస్తవం. కానీ నాకే సంతృప్తి కలగలేదు. ఇంకా బాగా డెవలప్ చేయాలనిపించి టైం తీసుకున్నాను.”

వెంకటేష్ తో సినిమాపై కిషోర్ తిరుమల రియాక్షన్ ఇది. తనకు వెంకీకి మధ్య అభిప్రాయ బేధాలొచ్చాయనే విషయాన్ని కూడా ఈ దర్శకుడు ఖండించాడు. ‘వాట్ అమ్మా వాట్’ సాంగ్ హిట్ అయినప్పుడు స్వయంగా వెంకీ తనకు ఫోన్ చేసి అభినందించారని చెప్పుకొచ్చాడు. వెంకీతో పాటు నాని, నితిన్ సినిమాలు కూడా లైన్లో ఉన్నాయని.. కానీ ఏ ప్రాజెక్టుకు కథ ఇంకా పూర్తిస్తాయిలో డెవలప్ చేయలేదని క్లారిటీ ఇచ్చాడు కిషోర్ తిరుమల.