సాయిధరమ్-గోపీచంద్ మలినేని పక్కా

సాయిధరమ్ తేజ మరో సినిమా కమిట్ అయ్యాడు. ఇప్పటికే వివి వినాయక్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. కరుణాకరన్ డైరక్షన్లో ఒక సినిమా ఫిబ్రవరిలో ప్రారంభం అవుతుంది. ఆ సినిమా ఒక షెడ్యూలు అయ్యాక, గోపీచంద్ మలినేని డైరక్షన్ లో భగవాన్ –పుల్లారావులు నిర్మించే సినిమా ప్రారంభమవుతుంది. గోపీచంద్ మలినేని చెప్పిన మెసేజ్ తో కూడిన ఓ మాంచి కమర్షియల్ లైన్ ను సాయిధరమ్ తేజ ఓకే చేసినట్లు తెలుస్తోంది.

గతంలో విన్నర్ సినిమా ఇదే కాంబినేషన్ లో నిర్మించారు. అయితే సరైన క్లయిమాక్స్ సెట్ కాక, కాస్త ఏవరేజ్ అయిపోయింది సినిమా. అయితే గోపీచంద్ టేకింగ్ మీద, సబ్జెక్ట్ మీద నమ్మకంతో సాయి ధరమ్ మళ్లీ చాన్స్ ఇవ్వడానికి సిద్దమయ్యాడు. గౌతమ్ నందా సినిమాను భారీగా తెరకెక్కించిన భగవాన్ పుల్లారావు ఈసారి సాయి ధరమ్ సినిమాను కూడా భారీ రేంజ్ లో తీయాలని బడ్జెట్ వేసుకుంటున్నారు. సినిమా భారీగా వుండడం సరే, ఇంతకీ పబ్లిసిటీ విషయంలో మరి గౌతమ్ నందా మాదిరిగా చేసి, దర్శకుడికి వదిలేస్తారో? ఈసారైనా సరైన ప్రచారం చేస్తారో చూడాలి.