హిట్ సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు

నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ సినిమా థియేటర్లలోకి వచ్చి 3ఏళ్లయింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో చిన్నపాటి హంగామా కూడా నడిచింది. తన సినిమాను హిట్ చేసినందుకు హీరో నిఖిల్, ఫ్యాన్స్ కు ధన్యవాదాలు కూడా తెలిపాడు. అక్కడితో ఆగకుండా ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించాడు.

“ప్రేక్షకులు, ఫ్యాన్స్ కు థ్యాంక్స్. కార్తికేయ పార్ట్-2 స్క్రిప్ట్ లోడింగ్” అంటూ ట్వీట్ చేశాడు నిఖిల్. కార్తికేయ సినిమాకు సంబంధించి కొన్ని అన్-సీన్ పోస్టర్లు విడుదల చేసిన నిఖిల్.. సీక్వెల్ పై మాత్రం ఇంతకుమించి క్లారిటీ ఇవ్వలేదు.

నిఖిల్, చందు మొండేటి కాంబినేషన్ లో వచ్చింది కార్తికేయ. చందు మొండేటికి ఇదే మొదటి సినిమా. అలా తొలి సినిమాతో సక్సెస్ కొట్టిన ఈ దర్శకుడు.. తర్వాత ప్రేమమ్ తో మరో సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం నాగచైతన్యతోనే సవ్యసాచి అనే సినిమా ప్రకటించిన చందు.. మరోవైపు నిఖిల్ నటిస్తున్న ఓ కొత్త సినిమాకు డైలాగ్స్ కూడా రాసిస్తున్నాడు. ఈ పనులన్నీ పూర్తయిన తర్వాత కార్తికేయ-2 సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది.