రామ్ చరణ్ ధృవ చేద్దామని డిసైడ్ అయినప్పుడు చిరంజీవి వ్యతిరేకించాడట. హీరో డౌన్ అయి, విలన్ పైన వుంటే తెలుగు వారు యాక్సెప్ట్ చేయరని అన్నాడట. అయితే చరణ్ మాత్రం గట్ ఫీలింగ్తో ఆ సినిమా చేసి చిరంజీవి జడ్జిమెంట్ రాంగ్ అని ప్రూవ్ చేశాడు. కొత్త ట్రెండు వైపు అడుగులు వేస్తోన్న చరణ్కి ధృవతో కాన్ఫిడెన్స్ వచ్చింది.
అలాగే చిరంజీవికి కూడా చరణ్ జడ్జిమెంట్పై గురి కుదిరింది. ఈ నేపథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో చరణ్ చేస్తోన్న చిత్రం మరింత ప్రయోగాత్మకంగా వుండనుంది. ఈ చిత్రంలో చరణ్ వినికిడి లోపమున్న పాత్ర చేయబోతున్నాడు. చాలా రిస్క్ అయినప్పటికీ సుకుమార్ చెప్పిన కథ విన్న చిరంజీవి ఫ్లాట్ అయిపోయాడట.
‘అద్భుతమైన కథ’ అంటూ సుకుమార్ని పొగడ్తలతో ముంచెత్తాడట. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆత్రుతగా వుందంటూ సుకుమార్ కాన్ఫిడెన్స్ని పదింతలు చేసాడట. ఈ కథ విన్నాక ఎక్కడ చిరంజీవి వద్దంటారో అని భయపడ్డ చరణ్కి చిరంజీవి నుంచి అలాంటి స్పందన వచ్చేసరికి ఆనందంగా వుందట.
వెంటనే ముహూర్తం పెట్టేసి, వచ్చే నెలలోనే షూటింగ్కి వెళ్లిపోదామని సుకుమార్తో చెప్పాడట. జనవరి 30న పూజ చేసి ఫిబ్రవరిలో షూటింగ్ మొదలు పెట్టనున్నారు. కుదిరితే ఆరు నెలల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.