టాలీవుడ్ ‘మిషన్ ఇంపాజిబుల్’లో స్టార్ హీరోయిన్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల డిటెక్టివ్ థ్రిల్లర్ సినిమాలకు తెరలేపిన సినిమా ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు డైరెక్టర్ ఆర్ఎస్జే స్వరూప్. అయితే ఏజెంట్ మూవీ డిటెక్టివ్ థ్రిల్లర్ గా అటు విమర్శకుల నుండి ఇటు ప్రేక్షకుల విశేషమైన ఆదరణ సొంతం చేసుకుంది. ప్రస్తుతం వేరే భాషల్లో కూడా రీమేక్ అవుతోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం స్వరూప్ దర్శకత్వంలో సెకండ్ మూవీ తెరకెక్కుతోంది. ‘మిషన్ ఇంపాజిబుల్’ (mishan impossible) పేరుతో మరో థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రూపొందుతుంది.

గతేడాది మొదలైన ఈ సినిమా ఆల్రెడీ కొద్దిపాటి షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఆల్రెడీ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా ప్రారంభంలోనే రిలీజ్ చేశారు. కానీ ఫస్ట్ లుక్ లో దేవుళ్ళతో గన్స్ పట్టించారని వివాదాలకు దారితీసింది. ప్రస్తుతం ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. ఆ మధ్యలో లాక్డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో హీరోయిన్ తాప్సీ ప్రధాన పాత్రకోసం ఖరారు అయినట్లు సమాచారం. ఆల్రెడీ తాప్సీ ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ చదివి సినిమాకు ఓకే చెప్పిందట.

ప్రస్తుతం తాప్సీ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. వరుసగా సినిమాలతో స్టార్డం అందుకుంటోంది. ఫస్ట్ మూవీని నెల్లూరు నేపథ్యంలో రాసుకున్న డైరెక్టర్ స్వరూప్.. ఈసారి సెకండ్ మూవీని తిరుపతి నేపథ్యంలో ప్లాన్ చేసాడట. ఇదిలా ఉండగా.. నీవేవరో సినిమా తర్వాత అమ్మడు మళ్లీ తెలుగులో కనిపించలేదు. దాదాపు మూడేళ్ల తర్వాత తాప్సీ తెలుగులో మిషన్ ఇంపాజిబుల్ మూవీతో రీఎంట్రీ చేయనున్నట్లు తెలుస్తుంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు మార్క్ కే రూబెన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి తాప్సీతో స్వరూప్ ఎలాంటి మాస్టర్ ప్లాన్ చూపించనున్నాడో..!