మరో బిజినెస్ లోకి అల్లు అర్జున్.!

ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ తో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి సినిమా షూటింగ్ కి కరోనా వైరస్ అనే అంతరాయం కలిగించింది. దాంతో ప్రస్తుతం టీం అంతా రెస్ట్ మోడ్ లో ఉన్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం తన ఫాదర్ అల్లు అరవింద్ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన ‘ఆహా’ని ప్రమోట్ చేసాయడం కోసం యాడ్ షూట్ ఫినిష్ చేసాడు.

అలాగే అల్లు అర్జున్ థియేటర్ బిజినెస్ లోకి దిగనున్నాడని, అందులో భాగంగానే అమీర్ పేట్ లోని సత్యం థియేటర్ ని మల్టీ ప్లెక్స్ గా మారచనున్నారని ఇదివరకే వార్తలొచ్చాయి. ఆ పనులు జరుగుతుండగానే అల్లు అర్జున్ మరో బిజినెస్ లోకి రంగ ప్రవేశం చేయడానికి డిసైడ్ అయ్యారు. అదే ఆటోమొబైల్ రంగం..

మాకు తెలిసిన సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఓ ఫేమస్ కార్ కంపెనీ వాళ్ళతో డీల్ కుదుర్చుకున్నారు. ఏపీ లో ఆ ఆటో మొబైల్ కంపనీకి సంబందించిన ఓ షో రూమ్ ని ఓపెన్ చేయనున్నారని సమాచారం. ఇప్పటికే అల్లు అర్జున్ కి హైదరాబాద్ లో కొన్ని పబ్స్ లో భాగస్వామ్యం ఉన్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ నుంచి అన్నదమ్ములందరూ ఆస్తి పంచుకున్న తర్వాత ఇలా అల్లు అర్జున్ స్వతహాగా బిజినెస్ లు స్టార్ట్ చేస్తున్నారు.