రామ్ సినిమాలో విలన్ గా సరైనోడు?

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ హీరోగా తమిళ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్‌ ఇటీవలే పట్టాలెక్కింది. భారీ అంచనాలున్న ఈ సినిమా లో హీరోయిన్ గా ఉప్పెన హీరోయిన్‌ కృతి శెట్టి నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా కు ఉస్తాద్‌ అనే టైటిల్‌ ను అనుకుంటున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ పాత్రకు గాను విలక్షన నటుడిగా పేరు దక్కించుకున్న ఆది పినిశెట్టిని ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి.

అల్లు అర్జున్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమాలో ఆది విలన్ గా నటించి మెప్పించాడు. తెలుగులో ఇంకా పలు సినిమాల్లో ఆది కనిపించాడు. కనుక ఈ సినిమాలో ఆది ఉండటం వల్ల ఖచ్చితంగా అదనపు ఆకర్షణ అనడంలో సందేహం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. లింగు స్వామి దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా ను వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా పై రామ్ మరియు యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంతో ఉన్నారు.