అఖిల్, శ్రియల మధ్య రాంచరణ్ భార్య

అక్కినేని ఫ్యామిలీలో ఇటీవలి పరిణామాలపై ఆ కుటుంబం నుంచి క్లారిటీ రాకపోయినా అసలు విషయం మాత్రం అంతా స్ప్రెడ్ అయింది. అక్కినేని ఇంటి చిన్నోడు అఖిల్ తన కంటే పెద్దదయిన అమ్మాయితో పెళ్లికి రెడీ అవడం.. అంతలోనే అభిప్రాయభేదాలు తలెత్తి క్యాన్సిల్ కావడంపై వార్తలు వచ్చాయి.  ఈ వివాహం రద్దు కావడంతో అక్కినేని నాగార్జున కూడా చాలా డిస్టర్బ్ అయ్యారట. మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ, ఇరు కుటుంబాలు కూడా ఈ విషయంపై నోరు మెదపడం లేదు. పలు కార్యక్రమాలకు హాజరవుతున్న అక్కినేని అమలను ఈ విషయం గురించి మీడియా ప్రశ్నిస్తున్నప్పటికీ, ఆమె ఏ మాత్రం స్పందించడం లేదు.

తాజాగా ఈ విషయంలో కొత్త అప్ డేట్ ఒకటి ఫిలింనగర్ లో వినిపిస్తోంది.  అఖిల్, శ్రియల మధ్య నెలకొన్న విభేదాలను తొలగించేందుకు ఇంకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయట. అయితే.. ఈ బాధ్యతను నెత్తినేసుకున్నది ఇంకెవరో కాదు. మరో బడా సినీ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి ఈ బాధ్యత తీసుకున్నారట. మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన.. అఖిల్, శ్రియలను కలిపేందుకు ప్రయత్నిస్తోందట.

జీవీ కృష్ణారెడ్డి కుటుంబంతో ఉపాసన కుటుంబానికి అత్యంత సాన్నిహిత్యం ఉంది. శ్రియకు కూడా ఆమె మంచి స్నేహితురాలు. ఈ క్రమంలో, వీరిద్దరినీ కలిపేందుకు ఉపాసన ట్రయ్ చేస్తోందని తెలుస్తోంది.  మరి ఈమె ప్రయత్నాలు ఎంతమేర విజయవంతమవుతాయో వేచి చూడాలి. ఉపాసన సక్సెస్ అయితే మాత్రం నాగ్ ఫ్యామిలీకి భారీ గిఫ్ట్ ఇచ్చినట్లే.


Recent Random Post: