అమీర్ ఖాన్ నిర్ణయం వల్ల జక్కన్నకు మార్గం సుగమం

మహాభారతం అనేది చాలా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. మహాభారత ఇతిహాసాన్ని సినిమాగా, లేదా వెబ్ సిరీస్ గా తీయాలని చాలా మందికి కోరిక. అయితే అంత నేర్పు, ఓర్పు, సహనం, పట్టుదల అందరికీ ఉండవు. గతంలో రాజమౌళి మహాభారతం తీయడం తన కల అని అయితే అది ఇప్పట్లో తీయలేనని స్పష్టం చేసాడు.

అయితే ఈలోగానే ఆమిర్ ఖాన్ మహాభారతం ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసాడు. ఈ మహాభారతాన్ని ఐదు పార్ట్స్ గా తెరకెక్కించాలని ఆమిర్ ఖాన్ భావించాడు. ఈ ప్రాజెక్ట్ కోసం ఒక భారీ సినిమాను కూడా వద్దనుకున్నాడు. దర్శకుడికి, రైటర్లకు అడ్వాన్స్ లు కూడా ఇచ్చేసాడు.

కానీ ఏమైందో ఏమో తెలీదు కానీ ఇప్పుడు ఆమిర్ ఖాన్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ లాభనష్టాలను బేరీజు వేసుకున్న తర్వాత ఆమిర్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో రాజమౌళి మహాభారతానికి ఇప్పుడు మార్గం సుగమమైంది.