బిగ్ బాస్ 5: మళ్ళీ అమ్మ మీద రవి ఒట్టేశాడా? – ఎపిసోడ్ 48

బిగ్ బాస్ సీజన్ 5 లో కెప్టెన్సీ టాస్క్ ముగిసింది. ఇంటి తదుపరి కెప్టెన్ గా సన్నీ ఎంపికయ్యడు. అయితే దానికంటే ముందు హౌజ్ లో చాలానే డ్రామా నడిచింది.

ముందుగా త్రిమూర్తులు మళ్ళీ కలిసిపోయారు. కోల్గేట్ స్మైల్ కాంటెస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా బిగ్ బాస్ ఒక్కొక్క ఇంటి సభ్యుడ్ని వచ్చి జీవితంలో మీరు వెనుకబడి ఆగిపోయాం అనుకున్న సందర్భాలు దాన్ని దాట్టుకుని స్మైల్ చేసుకున్న విషయం గురించి చెప్పమన్నాడు. ఈ కాంటెస్ట్ లో ఒక్కొక్కరూ తమ తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. అందరిలోకి జెస్సి కథ అందరినీ ఆకట్టుకుంది. తాను మోడల్ అయినా కూడా జెస్సి వాళ్ళ అమ్మ గారు తన కొడుకు పెద్ద మోడల్ అని చెప్పుకోలేదని కానీ బిగ్ బాస్ సీజన్ 5 కి సెలెక్ట్ అయ్యాను అని తెలియగానే చాలా గర్వంగా చెప్పుకున్నానని అన్నాడు. ఈ టాస్క్ నెగ్గిన తర్వాత జెస్సి మరోసారి షణ్ముఖ్, సిరిలకు సారీ చెప్పాడు. ముగ్గురూ కూడా మళ్ళీ కలిసిపోయారు.

ఇక ప్రియా మొన్నటి దాకా సన్నీ మీద అరిచేసి ఇప్పుడు పాజిటివ్ అయిపోయారు. సన్నీని కవ్విస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో మరో ఆసక్తికర అంశం ప్రియా, షణ్ముఖ్ ల మధ్య జరిగింది. సిరి ఫోటో స్టిక్కర్స్ ను రవి తీసి మళ్ళీ ఆమెతోనే డీలింగ్ మాట్లాడుకున్నాడని వీళ్లిద్దరి అనుమానం. అదే నిజం కూడా. కెమెరా కళ్ళకు చిక్కింది. అయితే రవి మరోసారి అమ్మ మీద ఒట్టేసాడు. అప్పట్లో లహరి విషయంలో అదే జరిగింది. మరి ఇప్పుడు కూడా అమ్మ మీద ఒట్టేసాడు.

ఇక కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా పోటీలో ఉన్న ఐదుగురు నడుముకు బలూన్స్ కట్టుకుని ఉంటారు. గార్డెన్ ఏరియాలో ఉన్న పిన్ ఉంటుంది. బజర్ మొగినప్పుడు ఒక ఇంటి సభ్యుడు ఆ పిన్ ను తీసుకుని తను సపోర్ట్ చేయాలనుకున్న కెప్టెన్సీ పోటీదారునికి ఇవ్వాల్సి వుంటుంది. ఈ టాస్క్ లో చివరిగా సన్నీ, రవి మిగిలారు. అప్పుడు ఎన్నీ మాస్టర్ అందరికంటే ముందు పిన్ ను తీసుకుని అది సన్నీకి ఇచ్చింది. దీంతో సన్నీ ఇంటి తదుపరి కెప్టెన్ గా నిలిచాడు. కెప్టెన్సీ గెలిచిన అనంతరం కెప్టెన్ డ్రెస్ ను వేసుకుని చాలా ఆనందించాడు. కెప్టెన్ అయ్యాక కూడా ప్రియా ను పిలిచి మీరు ఏ పని చేస్తారు అని అడిగి ఆమెకు సౌకర్యంగా ఉండేలా బెడ్ రూమ్ ఇచ్చాడు. చూస్తుంటే ఇద్దరి మధ్య గొడవలు సద్దుమణిగినట్లే అనిపిస్తోంది. ఇంకా రేషన్ మ్యానేజర్ ఎవరన్నది డిసైడ్ కాలేదు.