పక్కా.. ప్రభాస్ మళ్లీ అనుష్కతోనే

అనుష్కతో ఎన్ని సినిమాలైనా చేస్తా.. తనతో ఉండే కంఫర్టే వేరు అంటూ ‘మిర్చి’ సందర్భంగా స్టేట్మెంట్ ఇచ్చాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అన్న ప్రకారమే అనుష్కతో వీలైనన్ని సినిమాలు చేస్తూ పోతున్నాడు ప్రభాస్. ‘మిర్చి’ తర్వాత ‘బాహుబలి’ కోసం మళ్లీ అనుష్కతోనే జోడీ కట్టాడు ప్రభాస్.

ఈ రెండు సినిమాలకు కలిపి దాదాపుగా ఐదేళ్ల నుంచి అనుష్కతో ట్రావెల్ చేస్తున్న ప్రభాస్.. ఈ ఏడాది కూడా ఆమెతోనూ కొనసాగబోతున్నాడు. ప్రభాస్ కొత్త సినిమా ‘సాహో’లోనూ అనుష్కే హీరోయిన్ అన్నది తాజా సమాచారం. కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఊహాగానాల్ని చిత్ర బృందం ఖరారు చేసింది. అనుష్కే ‘సాహో’ హీరోయిన్ అని చిత్ర వర్గాలు ధ్రువీకరించాయి.

‘బిల్లా’తో తొలిసారి జోడీ కట్టిన ప్రభాస్-అనుష్కలకు ‘సాహో’ నాలుగో సినిమా అవుతుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ‘సాహో’ కోసం నేషనల్ వైడ్ ఫేమ్ ఉన్న బాలీవుడ్ హీరోయిన్ని తీసుకోవాలని అనుకున్నారు. ఇందుకోసం చాలా పేర్లను పరిశీలించారు కానీ.. ఎవ్వరూ ఫైనలైజ్ కాలేదు. చివరికి అనుష్క అయితే అన్ని రకాలుగా ఓకే అనుకుని ఆమెనే ఫైనల్ చేసినట్లు సమాచారం.

దక్షిణాదిన ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ‘బాహుబలి’తో ఉత్తరాది ప్రేక్షకులకూ చేరువైన అనుష్కతో ప్రభాస్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉండటం కూడా కలిసొస్తుందని భావిస్తున్నారు. ‘సాహో’ షూటింగ్ గురువారమే హైదరాబాద్‌లోని సెంట్రల్ లైబ్రరీలో మొదలైనట్లు సమాచారం. తర్వాత రామోజీ ఫిలిం సిటీలో షెడ్యూల్ ఉంటుందట. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ‘యువి క్రియేషన్స్’ నిర్మిస్తోంది.


Recent Random Post: