బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 పనులు షురూ

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ టాక్ షో ఎంత పెద్ద హిట్ అయిందో మనందరం చూసాం. ఆహాలో ఈ టాక్ షో స్ట్రీమ్ అయింది. మోహన్ బాబుతో మొదలైన ఈ టాక్ షో మహేష్ బాబు ఎపిసోడ్ తో ముగిసింది. ఎంతో మంది సెలబ్రిటీస్ ఈ షో కు గెస్ట్ లుగా విచ్చేసారు. బాలయ్య తనదైన శైలిలో ఈ టాక్ షో హోస్ట్ చేసి ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసాడు.

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ టాక్ షో సీజన్ 2 త్వరలోనే మొదలుకాబోతోంది. దీనికి సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయి. సీజన్ 2 గెస్ట్ లను కూడా ఫైనల్ చేసే పనిలో పడ్డారు నిర్వాహకులు. ఈసారి గెస్ట్ లుగా చిరంజీవి, వెంకటేష్, ప్రభాస్, తదితరులు గెస్ట్ లుగా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఈసారి మరింత ఎంటర్టైనింగ్ గా ఈ టాక్ షో ను ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య ప్రస్తుతం సినిమా కమిట్మెంట్ పూర్తయ్యాక సీజన్ 2 మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.