బాలయ్య సినిమాకు ఈ సీనియర్ హీరోయిన్ స్ట్రిక్ట్ నో

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ చిత్రంలో నటిస్తోన్న విషయం తెల్సిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది.

అఖండ తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఇక గోపీచంద్ మలినేని కాస్టింగ్ ప్రాసెస్ ను మొదలుపెట్టాడు. ఇప్పటికే వరలక్ష్మి శరత్ కుమార్ ను ఒక కీలక పాత్ర కోసం తీసుకున్నాడు.

సీనియర్ హీరోయిన్ టబును మరో కీలక పాత్ర కోసం అడగ్గా ఆమె నిర్మొహమాటంగా నో చెప్పినట్లు తెలుస్తోంది. బాలకృష్ణతో టబు చెన్నకేశవరెడ్డి సినిమాలో కలిసి నటించిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఈ పాత్ర కోసం మరో సీనియర్ హీరోయిన్ ను అనుకుంటున్నారు.