మోక్షజ్ఞ ఎంట్రీపై మరింత క్లారిటీ ఇచ్చిన బాలయ్య

నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ విషయంలో గత రెండేళ్ల నుండి ఎంతో సస్పెన్స్ నడుస్తోంది. రకరకాల రూమర్స్ మొదలవ్వగా రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి బాలకృష్ణ మాట్లాడుతూ ఆదిత్య 369 సీక్వెల్ తో మోక్షజ్ఞ తన సినీ ఎంట్రీ ఇస్తాడని తెలిపారు.

ఈ సీక్వెల్ లో బాలకృష్ణ హీరోగా నటిస్తుండగా మోక్షజ్ఞ కీలక పాత్ర చేస్తాడన్నమాట. ఇప్పుడు మరోసారి ఈ సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చాడు. ఆదిత్య 369 సినిమా విడుదలై 30 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమా విషయంలో స్పందించాడు.

ఈ చిత్రానికి ఆదిత్య 999 మ్యాక్స్ ను ఫిక్స్ చేసినట్లు తెలిపాడు. అలాగే ఈ సినిమాకు దర్శకుడు ఎవరన్నది ఇంకా ఖరారు చేయలేదని, తనే దర్శకత్వం వహించే అవకాశాలు కూడా ఉన్నాయని అన్నాడు. అలాగే అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ చిత్రం కోసం వాడతానని తెలిపాడు.