బోయపాటి ‘కేజీఎఫ్’ ఇంట్రెస్టింగ్ విషయం

యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రస్తుతం అఖండ సినిమా రూపొందుతోంది. రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి అయినట్లుగా ఇటీవలే యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత బోయపాటి చేయబోతున్న సినిమా ఏంటీ అనే విషయమై మొదటి నుండి ఇంట్రెస్టింగ్ కథనాలు వినిపిస్తున్నాయి. అఖండ సినిమా సక్సెస్ అయితే ఆయన దర్శకత్వంలో నటించేందుకు పలువురు స్టార్స్ సిద్దంగా ఉంటారు. కాని ప్రస్తుతానికి అంతా కూడా బిజీగా ఉన్నారని.. అందుకే కన్నడ స్టార్ యశ్ తో బోయపాటి శ్రీను సినిమాను చేసేందుకు చేసేందుకు గాను సిద్దం అవుతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.

అఖండ సినిమా చిత్రీకరణ సమయంలోనే యశ్ తో సినిమా ను బోయపాటి కన్ఫర్మ్ చేసుకున్నాడట. ఈ విషయంలో ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికి ఇండస్ట్రీ వర్గాల్లో వీరి కాంబో మూవీ గురించిన పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పెద్ద ఎత్తున అంచనాలున్న యశ్.. బోయపాటి మూవీ ని తెలుగు మరియు కన్నడంలో ఏక కాలంలో నిర్మిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈమద్య కాలంలో ఇతర భాషల హీరోలు తెలుగు సినిమాలకు క్యూ కడుతున్నారు. కనుక యశ్ కూడా ఈ సినిమా తో టాలీవుడ్ లో అడుగు పెట్టేందుకు చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాడు. కేజీఎఫ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత యశ్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆయన చేయబోతున్న ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతుంది. కనుక బోయపాటి కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

మీడియా సర్కిల్స్ మరియు ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుతున్న మాటలను బట్టి ఈ సినిమా కోసం బోయపాటి తన వద్ద ఉన్న ఒక పాత కథను బయటకు తీసినట్లుగా చెబుతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో గతంలో రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమా వచ్చింది. ఆ కథతో పాటు మరో రెండు మూడు కథలను కూడా బోయపాటి ఆ సమయంలో చరణ్ కు చెప్పాడట. అందులో నుండి వినయ విధేయ రామ సినిమా కథను చరణ్ ఎంపిక చేసుకున్నాడు. ఆ కథ కాస్త రివర్స్ అయ్యింది. ఆ సమయంలో చరణ్ తిరష్కరణకు గురి అయిన కథల్లో ఒక కథను ఇప్పుడు యశ్ ముందు ఉంచగా ఓకే చెప్పాడని.. ఇద్దరి కాంబోలో సినిమా పట్టాలెక్కబోతుందని.. వచ్చే ఏడాదిలో పాన్ ఇండియా రేంజ్ లో వీరి కాంబో మూవీ వస్తుందని అంటున్నారు. చరణ్ తిరష్కరించిన కథకు మార్పులు చేర్పులు చేర్పులు చేసి యశ్ తో పక్కా కమర్షియల్ మూవీగా బోయపాటి తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అనే సమాచారం అందుతోంది.

యాక్షన్ చిత్రాల దర్శకుడిగా బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను కేజీఎఫ్ తో పాన్ ఇండియా యాక్షన్ స్టార్ హీరో అంటూ పేరు దక్కించుకున్న యశ్ ల కలయికలో రాబోతున్న సినిమా ఎంత భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం యశ్ కేజీఎఫ్ 2 సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తుండగా.. బోయపాటి మాత్రం ఆయన తెరకెక్కించిన అఖండ విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు. వీరిద్దరు కలిసి ఈ ఏడాది చివరి వరకు సినిమా ను పట్టాలెక్కిస్తారు అనే కథనాలు మీడియా వర్గాల్లో వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటీ అనేది బోయపాటి నోరు తెరిస్తే కాని క్లారిటీ వచ్చే అవకాశం లేదు.