దిల్ రాజు అన్ స్టాపబుల్ .. ఆ స్పీడేంటి బాబోయ్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కున్న క్రేజ్ అందరికి తెలిసిందే. విభిన్నమైన చిత్రాలతో వరుస విజయాల్ని సాధిస్తూ అనతి కాలంలోనే ప్రేక్షకుల నాడి తెలిసిన నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. టేస్ట్ వున్న ప్రొడ్యూసర్గా గుర్తింపుని సొంతం చేసుకోవడమే కాకుండా క్రేజీ ప్రొడ్యూసర్గా ప్రత్యేకతని చాటుకున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు డిస్ట్రబ్యూషన్ పునుల కూడా చూసుకుంటూ ఇండస్ట్రీలో ప్రత్యేకతని చాటుకుంటున్నారు.

ఇటీవలే రెండవ వివాహం చేసుకున్న ఆయన మాంచి జోరుమీదున్నట్టుగా కనిపిస్తున్నారు. ఇంతకు ముందెన్నడూ లేని స్పీడుతో అన్ స్టాపబుల్ ప్లానింగ్ లో ఈ స్పీడేంటి బాబబోయ్ అనేంతగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు సగటు సినీ ప్రేక్షకుడికి షాకుల మీద షాకులిస్తున్నారు. పవర్ స్టార్ తో సినిమా చేయాలన్న చిరకాల కలని `వకీల్ సాబ్`తో ఫుల్ ఫిల్ చేసుకున్న దిల్ రాజు రెట్టించిన ఉత్సాహంతో కనీవినీ ఎరుగని ప్లానింగ్ తో వరుసగా పది చిత్రాలని లైన్ లో పెట్టడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

`ఎఫ్ 2` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన అనిల్ రావిపూడితో ప్రస్తుతం `ఎఫ్ 3` చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. విక్టరీ వెంకటేష్ – వరుణ్ తేజ్ మరోసారి కలిసి నటిస్తున్న ఈ మూవీలో తమన్నా మెహ్రీన్ హీరోయిన్ లుగా కనిపించనున్నారు. ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇదే ఊపులో తెలుగు హిట్ `జెర్సీ`ని మరో ఇద్దరు నిర్మాతలతో కలిసి దిల్ రాజు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఇది కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది.

షాహీద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. ఇక ఇదే ఏడాది మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లని కూడా దిల్ రాజు మొదలుపెట్టేశారు. అందులో శంకర్ – రామ్ చరణ్ ల ప్రాజెక్ట్ ఒకటి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఇటీవలే మొదలైన విషయం తెలిసిందే. ఇక ఇదే వరుసలో తమిళ స్టార్ విజయ్ – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఓ భారీ బైలింగ్వల్ కి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు కూడా.

అల్లు అర్జున్ తో ఐకాన్ మూవీని చేయాలని కూడా ప్లాన్ చేశారు. కానీ దీనికి సంబంధించిన అప్ డేట్ ఇంత వరకు రాలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ వుంటుందా? .. లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. శిరీష్ తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ `రైడీ బాయ్స్` ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుండగా నాగచైతన్యతో చేస్తున్న `థ్యాంక్యూ` కూడా రిలీజ్ కి ముస్తాబవుతోంది. వీటితో పాటు గుణశేఖర్ .. సమంత తో చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ `శాకుంతలం` నిర్మాణంలోనూ దిల్ రాజు భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. వీటితో పాటు సూర్య – బోయపాటిలతోనూ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.. ఇలా ఆయన సినిమాల లైనప్ లు చూసిన వారంతా దిల్ రాజు అన్ స్టాపబుల్ .. ఆ స్పీడేంటి బాబోయ్ అంటూ బిత్తర పోతున్నారు. `ఎఫ్ 3` నుంచి `శాకుంతలం` వరకు దిల్ రాజు చిన్నా పెద్దా అన్ని సినిమాలు కలిపి మొత్తం పది చిత్రాలని లైన్ లో పెట్టడం విశేషం.