దిల్ రాజు ఎందుకలా అబద్ధం చెప్పాడు

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరు చేసిన సినిమాని తాను చేశానని పేరేసుకోవడం… ఒకరి కథని తన కథే అని చెప్పుకోవడం సర్వసాధారణం. అత్యథిక భాగం ఒకరి క్రెడిట్ ని తమ ఖాతాలో వేసుకోవాలని తద్వారా వార్తల్లో నిలవాలని ప్రయత్నించని వారంటూ వుండరు. అయితే కొంత మంది మాత్రం ఎంత చేసినా తమ పని మాట్లాడాలే కానీ తమ గురించి తాము చెప్పడానికి ఇష్టపడరు. అలాంటి వ్యక్తుల్లో ముందు వరుసలో నిలుస్తున్నారు ప్రముఖ నిర్మాత దిల్రాజు.

ఇప్పటి వరకు ఆయన ఎన్నో చిత్రాల విజయాల వెనక వున్నారు. కానీ ఏనాడూ ఈ సినిమా నావల్లే హిట్ అయిందని చెప్పుకున్న సందర్భాలు లేవు. ఎప్పటిలాగే దిల్ రాజు తాజాగా ఓ చిత్రానికి వెన్నుదన్నుగా నిలిచారు. కానీ ఆ విషయాన్ని మాత్రం బయటపడనివ్వడం లేదు. ఇటీవలే ఆయన ఓ సినిమా ఫంక్షన్ కు హాజరయ్యారు. అంతే కాకుండా ఆ మూవీ విజయవంతంగా థియేటర్ల లో విడుదల కావడానికి తన వంతు ఎంత చేయాలో అంత చేశారు. అంత చేసినా ఈ సినిమాకు తనకు ఎలాంటి సంబంధం లేదని మేకర్స్ కి సహాయం చేయడానికి మాత్రమే తాను ఇక్కడికి వచ్చానని ఫంక్షన్ సాక్షిగా అబద్ధం చెప్పారు.

నిజానికి ఈ చిత్రానికి దిల్ రాజు 7 నుంచి 9 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఆ పెట్టుబడి సినిమా ఓటీటీ హక్కులు అమ్మిన తరువాతే ఆయన చేతికి వస్తుంది. ఈ విషయాన్ని కూడా ఆయన దాయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది దిల్ రాజు ఎందుకిలా అబద్ధం చెబుతున్నాడని షాకవుతున్నారు. అయితే దిల్ రాజు ఆలోచన మరోలా వుంది. తాను పెట్టిన పెట్టుబడి గురించి చెబితే సినిమాకు మొత్తం తానే అని అంతా భావించి అసలు నిర్మాతని పక్కన పెట్టే అవకాశం వుంది. దాని వల్ల ఆయన గౌరవం దెబ్బతింటుంది. అది ఆలోచించారు కాబట్టే దిల్ రాజు తనకు ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని అబద్ధం చెప్పారట.

అంతే కాకుండా ఈ సినిమాకు డబ్బులు రావచ్చు రాకపోవచ్చు కానీ అవార్డులు మాత్రం వస్తాయని దాని వల్ల ఈ ప్రాజెక్ట్ కి డబ్బులు పెట్టింది తానే అని తెలిస్తే సదరు నిర్మాతకు దక్కాల్సిన గౌరవం దక్కదరి దిల్ రాజు ఫీలయ్యారట. ఆ కారణంగానే తను అబద్ధం చెప్పారని తెలిసి ప్రతీ ఒక్కరు దిల్ రాజు గొప్పతనాన్ని ప్రశంసిస్తున్నారు.

అంతే కాకుండా తన మంచి మనసుతో దిల్ రాజు ఎంతో మంది హృదయాల్ని గెలుచుకున్నారని తోటి నిర్మాతకు క్రెడిట్ ఇవ్వాలన్న ఆయన తపన నిజంగా అభినందనీయమని దిల్ రాజుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజు వరుస భారీ ప్రాజెక్ట్ లని నిర్మిస్తున్న క్షణం తీరిక లేని బిజీలో వున్నారు.