శింబు మానాడు రీమేక్ లో నాగ చైతన్య?

వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు, ఎస్ జె సూర్య ప్రధాన పాత్రల్లో రూపొందించిన చిత్రం మానాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. టైమ్ లూప్ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ సోనీ లివ్ లో కూడా స్ట్రీమ్ అవుతోంది. రీసెంట్ గా సురేష్ ప్రొడక్షన్స్, ఈ చిత్ర రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేసినట్లు అధికారికంగా వెల్లడించిన విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో శింబు పాత్రలో ఎవరు నటిస్తారన్న ఆసక్తి పెరిగింది. తాజా సమాచారం ప్రకారం మానాడు రీమేక్ లో నాగ చైతన్య నటించనున్నట్లు తెలుస్తోంది. ఎస్ జె సూర్య తెలుగులో కూడా తన పాత్రను పోషిస్తాడట. మానాడు రీమేక్ కు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలుస్తాయి.

ప్రస్తుతం నాగ చైతన్య థాంక్యూ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నాడు.