అంటే నాని ఇంకా మొదలు పెట్టకుండానే రూ.50 కోట్ల డీల్‌

యంగ్ హీరో నాని ఈ ఏడాది ‘వి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాను ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఆ సినిమా నిరాశ పర్చడంతో పాటు ఈ ఏడాది పూర్తిగా ఖాళీగా ఉండటం వల్ల వచ్చే ఏడాది ఏకంగా మూడు సినిమాలను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. అతి త్వరలోనే టక్‌ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ‘అంటే సుందరానికి‘ అంటూ నాని ఒక సినిమాను చేస్తున్నాడు.

వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ గా రూపొందబోతున్న ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ఇంకా ప్రారంభం కాకుండానే ప్రముఖ ఓటీటీ జీ5 వారు ఏకంగా రూ.50 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. జీ5 సంస్థ ఈ సినిమా థియేట్రికల్‌ రైట్స్‌ ఓటీటీ రైట్స్ ఇంకా శాటిలైట్ రైట్స్‌ ను కూడా కలిపి ఈ డీల్‌ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల చిన్న హీరోల సినిమాలకు పెద్ద మొత్తాలను ఇచ్చి మరీ జీ5 వారు కొనుగోలు చేస్తున్నారు. ఈ సినిమా ను కూడా భారీ మొత్తానికి కొనుగోలు చేసిందని అంటున్నారు. మైత్రి మూవీస్ వారు ఈ సినిమాను పాతిక కోట్లతో నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది.