ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా కొత్త అప్డేట్!!

రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్నాడు. రాధే శ్యామ్ చిత్రాన్ని పూర్తి చేసి వీలైనంత త్వరలో విడుదల చేయాలని భావిస్తున్నాడు. అయితే ప్రభాస్ నటిస్తోన్న మరో రెండు సినిమాలు కూడా ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. ఆది పురుష్, సలార్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ను మొదలుపెట్టాలని భావించాడు.

అయితే నాగ్ అశ్విన్ ఓ సందర్భంలో జులై నుండే ఈ సినిమా షూటింగ్ ఉంటుందని చెప్పాడు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇది పట్టాలెక్కడానికి ఆలస్యమవుతోంది. ఆగస్ట్ లో కానీ నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వదు. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ డ్రామా అని, ప్రభాస్ ఇందులో సూపర్ హీరో పాత్రలో నటిస్తాడని ఇప్పటికే రివీల్ అయింది. నాగ్ అశ్విన్ ఈ చిత్రం కోసం ఒక కొత్త ప్రపంచాన్నే సృష్టిస్తున్నాడట. అందుకే ఆ ఆలస్యం.