సర్కారు వారి ముందే చిందులా?

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సర్కార్ వారి పాట సంక్రాంతి బరి నుంచి వైదొలగి తదుపరి రిలీజ్ తేదీని వెతుక్కుంటున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇంకా స్పష్ఠంగా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంటుంది. అయితే ఈలోగానే ప్రచారానికి అవసరమైన ప్రాధాన్యతనివ్వనున్నారని తెలిసింది.

తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ మూవీ ప్రమోషన్స్ గురించి తెలిపారు. ఫిబ్రవరి 14న వరుస సింగిల్స్ విడుదలయ్యేందుకు ఆస్కారం ఉందని ఖరారు చేస్తూ.. అతను సంగీతం ప్రేమ ఎమోజీలను కూడా జోడించాడు. సర్కారు వారి పాట నుండి మొదటి పాట విడుదల గురించి అతను సూచించాడని ఊహాగానాలు చేస్తున్నారు. ఈ వార్త ఉభయ అభిమానులను ఆనందపరిచింది. ప్రస్తుతానికి కీర్తి సురేష్ కథానాయికగా నటించిన పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1 ఏప్రిల్ 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సర్కార్ వారి కోసం త్రివిక్రమ్ వెయిటింగ్

ఇటీవల తనకు కోవిడ్ సోకిందని మహేష్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఓ ట్వీట్ లో మహేష్ వెల్లడిస్తూ..“మైల్డ్ సింప్టమ్స్ బయటపడ్డాయి. డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాను“ అని మహేష్ తెలిపారు. ప్రజలంతా కోవిడ్ నియమనిబంధనలు విధిగా పాటించాలని కూడా మహేష్ కోరారు.

మహేష్ ప్రస్తుతం సర్కార్ వారి పాట పెండింగ్ చిత్రీకరణను వేగంగా ముగించేందుకు ప్రణాళికల్లో ఉన్నారు. తదుపరి త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సి ఉంటుంది. అలాగే అతడి మోకాలికి ఇటీవల శస్త్ర చికిత్స జరిగినట్టు కథనాలొచ్చాయి. తాజాగా కోవిడ్ నుంచి వేగంగా కోలుకుంటున్న మహేష్ తదుపరి ఇతర షెడ్యూల్స్ పైనా దృష్టి సారించే వీలుంది.