సర్కారు వారి పాట చిత్ర క్రేజీ అప్డేట్!!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. మొదటి షెడ్యూల్ ను దుబాయ్ లో చిత్రీకరించారు. మొదటి షెడ్యూల్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే హైదరాబాద్ లో ఒక షార్ట్ షెడ్యూల్ ను కూడా షూట్ చేసారు.

ఇక మూడో షెడ్యూల్ కోసం గోవా వెళ్లారు సర్కారు వారి పాట టీమ్. ప్రస్తుతం అక్కడే షూటింగ్ జరుగుతోంది. ఇక్కడ ఒక సాంగ్ తో పాటు పలు ఫైట్ సీక్వెన్స్ లను కూడా షూట్ చేసారు. త్వరలోనే ఈ షెడ్యూల్ కూడా పూర్తవుతుంది.

గోవా షెడ్యూల్ తర్వాత మరో షెడ్యూల్ కోసం ఫారిన్ వెళ్లనున్నారు సర్కారు వారి పాట. అక్కడ కూడా రెండు పాటలతో పాటు ఒక భారీ క్యాసినో యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తారట. పరశురామ్ ఈ సినిమాకు దర్శకుడన్న విషయం తెల్సిందే.