సుధీర్ బావ అంటూ శ్రీముఖి సందడి

టీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్‌ కామెడీ షో మంచి రేటింగ్‌ తో దూసుకు పోతుంది. ఇప్పుడు అందులోని కమెడియన్స్ మరియు కొందరు సోషల్‌ మీడియా సెలబ్రెటీలతో కలిపి శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ఫన్‌ షో ను ఈటీవీ నిర్వహిస్తుంది. ఆ షో లో సుధీర్‌, రామ్ ప్రసాద్‌, ఆది ఇంకా పలువురు కమెడియన్స్ ఉంటున్నారు. వారితో పాటు అప్పుడప్పుడు గెస్ట్‌ లు కూడా వస్తున్నారు. వచ్చే వారం ప్రసారం కాబోతున్న షో కు శ్రీముఖి గెస్ట్‌ గా హాజరు కాబోతుంది.

ప్రతి వారం ఒక థీమ్ తో ఈ షో ను నిర్వహిస్తున్నారు. వచ్చే వారు ఫ్యాక్షన్‌ ఫ్యామిలీకి చెందిన శ్రీముఖి సుధీర్‌ ను ఇష్టపడుతుంది. సుధీర్ ను బావ అంటూ పిలుస్తుంది. ఆమె సిగ్గు పడుతూ సుధీర్‌ ను బావ అంటూ పిలుస్తుంటే చాలా క్యూట్‌ గా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే వారం ఎపిసోడ్‌ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఆది మరియు సుదీర్‌ ల కాంబో కామెడీ ప్రతి వారం సూపర్‌ హిట్ అవుతోంది.