సీక్వెల్‌కు టైటిల్‌ పెట్టిన వైట్ల

మంచు మనోజ్‌ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘ఢీ’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సీక్వెల్‌ చేయాలని శ్రీనువైట్ల అనుకున్నాడు. ఆ తర్వాత పెద్ద హీరోలతో ఛాన్స్‌లు రావడంతో సీక్వెల్‌ విషయాన్ని పక్కకు పెట్టేశాడు. మంచు విష్ణు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు వైట్లకు స్టార్‌ హీరోల ఛాన్స్‌లు రాని కారణంగా సీక్వెల్‌కు ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

గత కొన్ని నెలలుగా ఈ సీక్వెల్‌ కోసం రచయితలతో కలిసి శ్రీనువైట్ల స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నాడు. మంచు విష్ణు స్వయంగా ఈ సినిమాను నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్నాడు. కనుక సినిమాను వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే పట్టుదలతో యూనిట్‌ సభ్యులు ఉన్నారు. ఇక ఈ సినిమాకు ‘ఢీ అండ్‌ ఢీ’ అనే టైటిల్‌ ను ఖరారు చేయడం జరిగింది. అందుకు సంబంధించి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారట.

ఢీ చిత్రంలో మంచు విష్ణుకు జోడీగా జెనీలియా నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో ఇద్దరి కాంబోకు మంచి పేరు వచ్చింది. కాని ఇప్పుడు ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. కనుక ఆమెను హీరోయిన్‌గా నటింపజేసే అవకాశం దాదాపుగా లేదు. ఆమె స్థానంలో మంచు మనోజ్‌కు జోడీగా ఎవరు నటిస్తారు అనే ఆసక్తి అందరిలో ఉంది. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్‌ కాకుండా కొత్త హీరోయిన్‌ ఎవరైనా నటిస్తే బాగుంటుందనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.