వైజాగ్ గ్యాస్ లీక్: టాలీవుడ్ సెలబ్రిటీస్ రియాక్షన్

ఈ రోజు ఉదయం 3 గంటల 30 నిమిషాల ప్రాంతంలో విశాఖపట్నంలో ఓ కెమికల్‌ ఫ్యాక్టరీ విషం చిమ్మింది. విష వాయువులు వెలువడ్డంతో ఆ ఫ్యాక్టరీ పరిసరాల్లోని గ్రామాల్లోగల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 8 మంది చనిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అలాగే 250 మంది తీవ్ర అస్వస్థతకి గురికాగా, సుమారు 5000 మందికి పైనే ఈ విషవాయువు బారిన పడ్డారని రిపోర్ట్స్ చెబుతున్నాయి.

ఈ విషయం తెలిసిన వెంటనే తెలుగు సినిమా తారలు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. అలాగే సోషల్ మీడియా ద్వారా వారి వారి సానుభూతిని తెలియజేస్తూ, అక్కడి ప్రజలకు ఏమీ కాకూడదని కోరుకుంటున్నారు.