ఆ సినిమా మహేష్ కి తెగ నచ్చేసిందట.. తప్పకుండా చూడమంటున్నాడు

సుహాస్ ప్రధాన పాత్రలో చిన్న బడ్జెట్ సినిమాగా రూపొంది ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన రైటర్ పద్మభూషణ్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కిన విషయం తెల్సిందే. మంచి రివ్యూలు రావడంతో పాటు ప్రేక్షకులు కూడా పాజిటివ్ మౌత్ టాక్ ను ప్రచారం చేయడం జరిగింది.

రైటర్ పద్మభూషణ్ సినిమా కి ఇప్పటికే మంచి కలెక్షన్స్ నమోదు అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇవ్వడంతో మరింతగా కలెక్షన్స్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్విట్టర్ ద్వారా మహేష్ బాబు ‘రైటర్ పద్మభూషన్’ సినిమా గురించి స్పందించాడు.

సినిమా చూసిన తర్వాత చిత్ర యూనిట్ సభ్యులతో దిగిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసిన మహేష్ బాబు… ‘రైటర్ పద్మభూషణ్’ సినిమాను చూసి ఆనందించాను. మంచి చిత్రం.. ముఖ్యంగా క్లైమాక్స్ బాగుంది. ప్రతి ఒక్కరు చూడదగ్గ చిత్రం. ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే చిత్రం. సినిమాలో సుహాస్ నటన బాగుంది.. ఇతన నటీ నటులు మరియు సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు.

మహేష్ బాబు ట్వీట్ తో చిత్ర యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ ట్వీట్ తో యూనిట్ సభ్యులు అంతా కూడా ఆకాశంలో తేలుతున్నట్లుగా ఆనందంగా ఉన్నారు. టీనా శిల్పరాజ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రోహిణి మరియు ఆశిష్ విద్యార్థి కీలక పాత్రల్లో కనిపించిన విషయం తెల్సిందే. మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అయినా కూడా మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి.