బన్నీలోని పవర్ చూసి ఆశ్చర్యం కలిగేది

సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టు కోటా శ్రీనివాస్ ఈమద్య కాలంలో సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు కాని మీడియాలో మాత్రం రెగ్యులర్ గా కనిపిస్తున్నాడు. ఆయన పర భాష నటులను టాలీవుడ్ లో అందలం ఎక్కించడంపై ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నాడు. ఆమద్య మెగా బ్రదర్ నాగబాబు పై వ్యాఖ్యలు.. ఆ వ్యాఖ్యలకు నాగబాబు రియాక్షన్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎన్టీఆర్ మరియు బాలకృష్ణ లను గురించి కూడా కోటా విమర్శిస్తూ ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. పాత విషయాలను ఇప్పుడు వెళ్లదీస్తూ కోటా శ్రీనివాస్ చేస్తున్న వ్యాఖ్యలు మరియు విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్ద ఎత్తున ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మరోసారి ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈసారి ఆయన పాజిటివ్ గా వ్యాఖ్యలు చేయడం జరిగింది.

వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న కోటా శ్రీనివాస్ తాజా ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించాడు. ఇంతకు ముందు మెగా ఫ్యామిలీకి చెందిన వారిని సున్నితంగా విమర్శించిన కోటా ఇప్పుడు అల్లు అర్జున్ ను పొగడ్తలతో ముంచెత్తడం చర్చనీయాంశం అయ్యింది. అల్లు అర్జున్ యొక్క నటన ప్రతిభ మరియు అతడి డాన్స్ స్పీడ్ గురించి కోటా మాట్లాడటం జరిగింది. అల్లు అర్జున్ గురించి ఎవరు మాట్లాడినా కూడా ఆయన డాన్స్ గురించి మరియు స్టైలింగ్ గురించి మాట్లాడాల్సిందే. కోటా కూడా అదే విషయాన్ని చెప్పుకొచ్చారు. బన్నీలో ఒక పవర్ హౌస్ ఉన్నట్లుగా ఎంతో యాక్టివ్ గా కనిపిస్తాడు.. ఎప్పుడు కూడా చాలా పవర్ తో బన్నీ ఉంటాడు అన్నట్లు కోటా శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు.

ఇంకా కోటా మాట్లాడుతూ.. తన ప్రతి సినిమాతో కూడా అల్లు అర్జున్ నెక్ట్స్ లెవల్ కు చేరుకుంటున్నాడు. యూత్ లో అద్బుతమైన ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంటున్నాడు. నేను సెట్స్ లో బన్నీ నటన చూస్తున్న సమయంలో అతడిలోని పవర్ కు ఎనర్జికి అలా చూస్తూ ఉండిపోయేవాడిని. వర్క్ విషయంలో చాలా సీరియస్ గా ఉంటాడు. తన ప్రతి సినిమాకు కూడా కష్టపడుతూనే ఉంటాడు. సినిమా సినిమాకు తన స్టార్ డమ్ ను పెంచుకుంటూ వస్తున్నాడు. తాత.. మేనమామ స్టార్ డమ్ ను కంటిన్యూ చేస్తూనే తనకంటూ ప్రత్యేకతన సంతరించుకోవడంలో బన్నీ ఇప్పటికే సఫలం అయ్యాడు అన్నట్లుగా కోటా అభిప్రాయం వ్యక్తం చేశాడు.

పెద్ద ఎత్తున అంచనాలున్న పుష్ప సినిమా తో అల్లు అర్జున్ రాబోతున్నాడు. ఆ సినిమా కోసం బన్నీ ఎంతటి మాస్ లుక్ లో కనిపించబోతున్నాడో ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఆ సినిమా రెండు పార్ట్ లుగా విడుదల కాబోతుండగా మొదటి పార్ట్ ను వచ్చే నెలలో తదుపరి పార్ట్ ను వచ్చే ఏడాదిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప లో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా సునీల్.. ఫాహద్ ఫాజిల్ మరియు అనసూయలు కీలక పాత్రలో కనిపించబోతున్నారు.