మహేష్ ఫ్రెండ్లీ.. చరణ్ బడ్డీ!

తెలుగు సినిమా పరిశ్రమలో అడుగు పెట్టడమే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో నటించిన కియారా అద్వానీ, తదుపరి చిత్రం చరణ్ తో చేసింది. బాలీవుడ్ లో చేసిన అర్జున్ రెడ్డి రీమేక్ ఆమె జాతకమే మార్చేసింది. అలా తెలుగు సినిమాతో కియారా బంధం బలపడిపోయింది.

తెలుగు సినిమా ఋణం తీర్చుకోలేనని అంటున్న కియారాకి ఇప్పటికీ పలు పెద్ద చిత్రాల్లో హీరోయిన్ గా ఆఫర్స్ వెళ్తున్నాయి. అయితే హిందీ చిత్రసీమలో బిజీగా ఉండడంతో కియారా తెలుగు సినిమాలకి డేట్స్ ఇవ్వలేకపోతోంది. త్వరలోనే ఒక భారీ తెలుగు చిత్రంలో నటిస్తున్నట్టు మాత్రం ఆమె చెప్పింది.

అంతకు మించి వివరాలేమీ ఇవ్వలేదు. తాను నటించిన తెలుగు హీరోల గురించి చెప్పమంటే, మహేష్ సూపర్ స్టార్ అయినా చాలా ఫ్రెండ్లీ అని చెప్పింది. ఇక చరణ్ అయితే ట్యాంకు బెస్ట్ బడ్డీ (స్నేహితుడు) అయిపోయాడని చెప్పింది.