మరోసారి తన క్రేజ్ ను చాటుకున్న విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ తన కెరీర్ లో దూసుకుపోతున్నాడు. అర్జున్ రెడ్డితో నేషనల్ వైడ్ క్రేజ్ ను తెచ్చుకున్న విజయ్ తెలుగులో రీసెంట్ గా ప్లాప్స్ ను అందుకున్నాడు. అయినా కానీ తన క్రేజ్ మరింత పెరిగింది కానీ తగ్గింది లేదు.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ హీరోగా లైగర్ చిత్రాన్ని చేస్తున్నాడు విజయ్. ఈ చిత్రం ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతోంది. రీసెంట్ గా టైమ్స్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన లిస్ట్ లో మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా సెకండ్ ప్లేస్ లో నిలిచాడు విజయ్.

ఇక ఇప్పుడు ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ డబూ రత్నాని స్పెషల్ ఫోటోషూట్ లో ఫీచర్ అయ్యాడు విజయ్ దేవరకొండ. ఒక హై రేంజ్ బైక్ పై కండలు తిరిగిన దేహంతో స్టైలిష్ గా కూర్చున్నాడు విజయ్. సౌత్ నుండి డబూ కేలండర్ లో ఫీచర్ అయిన తొలి సౌత్ ఇండియన్ హీరోగా నిలిచాడు.