
కోలీవుడ్ సినీ నటుడు, దర్శకుడు రాధాకృష్ణన్ పార్థిబన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. 16కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన, 14కి పైగా సినిమాలను నిర్మించి, 70కి పైగా చిత్రాల్లో నటుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. తన ప్రత్యేకమైన దర్శకత్వ శైలితో విమర్శకుల ప్రశంసలు అందుకున్న పార్థిబన్, ఇటీవల కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
ఇక తాజాగా తమిళనాట రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్న నేపథ్యంలో, నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ద్వారా ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పార్థిబన్ గతంలో విజయ్–త్రిష రిలేషన్పై చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీస్తున్నాయి. అప్పట్లో విజయ్, నటి త్రిష కలిసి పలు ఈవెంట్లకు హాజరుకావడం, ఒక వివాహ వేడుకలో కనిపించడం వంటి ఘటనలతో వారి మధ్య సంబంధంపై రూమర్లు చెలరేగాయి. ఆ సమయంలో పార్థిబన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు తాజాగా పార్థిబన్, మరో సీనియర్ నటుడు ఎం.ఎస్. భాస్కర్తో కలిసి సీఎం విజయ్ను ఆయన కార్యాలయంలో కలవడం హాట్ టాపిక్గా మారింది. ఈ సందర్భంగా ఆయన పుష్పగుచ్ఛం అందించడంతో పాటు, ప్రత్యేకంగా రూపొందించిన ఒక ఫోటో ఫ్రేమ్ను బహుమతిగా ఇచ్చారు. చక్రవర్తి గెటప్లో, రాజసంగా సింహాసనంపై ఉన్నట్లుగా రూపొందించిన ఈ ఫ్రేమ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అంతేకాకుండా, ఆ ఫ్రేమ్పై పార్థిబన్ తనదైన శైలిలో కవితాత్మక సందేశాన్ని కూడా రాశారు. “సినిమా రంగం నుండి ముఖ్యమంత్రి పీఠం వరకూ ప్రయాణించి, శాంతియుతమైన, ఆహ్లాదకరమైన పాలనను అందించాలనే ఆకాంక్షతో విజయ్ సింహాసనాన్ని అధిరోహించారు” అనే భావనను ఆయన తన సందేశంలో వ్యక్తపరిచారు.
ఇక ఈ భేటీపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో త్రిషపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ కొందరు నెటిజన్లు పార్థిబన్ వైఖరిపై కామెంట్లు చేస్తున్నారు. “అప్పుడు ఒకలా, ఇప్పుడు మరోలా” అంటూ విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఏదేమైనా, విజయ్–త్రిష రిలేషన్ రూమర్ల నేపథ్యంలో పార్థిబన్ తాజా భేటీ, బహుమతి వ్యవహారం తమిళ సినీ–రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది.
Recent Random Post:















