
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం వరుస సినిమాలతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారారు. ఒకవైపు రామ్ పోతినేనితో ఆమె రిలేషన్లో ఉందంటూ సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వైరల్ అవుతున్న వేళ, తాజాగా హైదరాబాద్పై ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట మరింత చర్చనీయాంశంగా మారాయి. అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్న భాగ్యశ్రీ, హైదరాబాద్ గురించి చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి.
అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ఈ రూరల్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ‘లెనిన్’ ప్రమోషన్స్లో భాగంగా స్టార్ యాంకర్ సుమ హోస్ట్ చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొంది. ఈ సందర్భంగా సుమ అడిగిన ప్రశ్నకు సమాధానంగా భాగ్యశ్రీ మాట్లాడుతూ.. “నా ఫస్ట్ హోమ్ ఔరంగాబాద్. కానీ నా సెకండ్ హోమ్ మాత్రం హైదరాబాద్. అది ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది” అంటూ ఆసక్తికరంగా చెప్పారు.
భాగ్యశ్రీ మాటలకు యాంకర్ సుమ తనదైన స్టైల్లో స్పందిస్తూ “కంగ్రాట్స్ భాగ్యశ్రీ.. వెల్కమ్ టు హైదరాబాద్. ఇండియా నలుమూలల నుంచి వచ్చి ఇక్కడే సెటిల్ అవుతున్నవారు చాలా మంది ఉన్నారు. మీరు కూడా అలాగే ఇక్కడే స్థిరపడాలని కోరుకుంటున్నా” అన్నారు. ఈ సంభాషణ సమయంలో పక్కనే ఉన్న అఖిల్ అక్కినేని నవ్వుతూ కనిపించడం విశేషంగా నిలిచింది.
మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. జులై 10న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఒకవైపు రూమర్స్ కొనసాగుతున్న సమయంలో భాగ్యశ్రీ “హైదరాబాద్ నా సెకండ్ హోమ్” అని చెప్పడం టాలీవుడ్లో కొత్త చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్యలతో ఆమె ఇక్కడే లాంగ్ రన్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ‘లెనిన్’ సినిమా ఆమె కెరీర్కు ఎంతవరకు మైలురాయిగా నిలుస్తుందో చూడాలి.
Recent Random Post:















