ఆ ఇబ్బంది ఉన్నా… దేశం మొత్తం పర్యటిస్తా: సామ్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం శాకుంతలం. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో శకుంతల దుష్యంతుల ప్రేమకథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక శాకుంతలంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నాడు.ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ పాటలకు మంచి స్పందన వచ్చింది.

ఇక ఈ చిత్రం పాన్ ఇండియా కథాంశంతో వస్తోంది. ఏప్రిల్ 14న తెలుగు తమిళ్ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఏకకాలంలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగం పెంచింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్లో సమంత కూడా పాల్గొంటుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో సామ్ పర్యటించనుంది.

తను మయోసైటిస్ అనే వ్యాధితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తను కాస్త కోలుకున్నట్లు ప్రకటించింది. అయితే తన శక్తి మేరకు ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గోంటానని ఇప్పటికే చిత్ర యూనిట్ కు మాటిచ్చినట్లు సమాచారం. ఆమె మాట ఇస్తే.. కచ్చితంగా మాట మీద నిలబడుతుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ముంబై ఈవెంట్లో సమంత పాల్గొన్న విషయం తెలిసిందే. అక్కడ ఆమెను చూసిన ఫోటోగ్రాఫర్లు.. సమంత ఫోటోలు తీసేందుకు పోటీ పడ్డారు. దీనితో ఆమె కాస్త ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది.

ఫ్లాష్ కళ్లలో పడితే… ఇబ్బంది తలెత్తుందని ఇప్పటికే సమంత తాను ఇచ్చిన ఇంటర్వ్యూ లలో చెప్పింది. ఇక దేశం మొత్తం పర్యటిస్తానని చెబుతున్న సమంత… ఆమెను కచ్చితంగా ఫోటోలు తీయాల్సి ఉంటుంది. ఫ్లాష్ ఇబ్బంది ఉన్నప్పటికీ.. సినిమా కోసం కష్టపడుతుందని తెలుస్తోంది. ఇక ముంబై ఈవెంట్లో మాత్రం సామ్ ఫోటోలు తీసేందుకు ఫోటో గ్రాఫర్లు పోటీ పడినా.. శాంతంగా రెస్పాండ్ అయింది.

ఇక ఈ చిత్రంలో అనన్య నాగళ్ల అదితీ మోహన్ ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. శాకుంతలం ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది. శాకుంతలం ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది.