కంగన-హృతిక్ వివాదం జావేద్ సెటిల్ చేయబోయారా?

బాలీవుడ్ నటి కంనగా రనౌత్-రచయిత జావేద్ అక్తర్ మధ్య కొంత కాలంగా వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. 2016 లో జావెద్ ఇంటికి ఆహ్వానించి బెదిరించాడని గతం లో కంగన ఆరోపణలు చేసింది. వాటిని జావేద్ ఖండిచారు. కంగన పై కోర్టులో పరువు నష్టం దావా కేసు కూడా వేసారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ కు రావడంతో అందేరి మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరైన జావెద్ ఆ నాడు ఏం జరిగిందన్నది కోర్టుకు వివరించే ప్రయత్నం చేసారు.

హృతిక్ రోషన్-కంగన మధ్య నడుస్తోన్న గొడవని పరిష్కరించేందుకు ఇంటికి రమ్మని పిలిచినట్లు తెలిపారు. ‘కంగన తో నాకు పెద్దగా పరిచయం లేదు. నా స్నేహితుడు రమేష్ అగర్వాల్ కి ఆమె బాగా తెలుసు. హృతిక్ తో అమెకి గొడవలున్నప్పుడు వాటిని సద్దుమణిగేలా చేయాలనే రమేష్ ఆమెకి ఫోన్ చేసి మా ఇంటికి రమ్మని చెప్పాడు.

దాంతో ఆమె తన సోదరి రంగో లని వెంట తీసుకుని ఇంటికి వచ్చారు. మేం నచ్చజెప్పడానికి ప్రయత్నించినా కంగన వినాలను కోలేదు. దాంతో ఆమె మా ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె మనసు ను ఇబ్బంది పట్టేలా ఆ రోజు ఎక్కడా మాట్లాడలేదు’ అని కోర్టుకు తెలిపారు.

దీంతో కంగనతో జావెద్ వివాదం పై ఓ క్లారిటీ కనిపిస్తుంది. అయితే జావెద్ చెప్పిందంతా? వాస్తవమేనా? అని కోర్టు తేల్చాల్సి ఉంది. మరో యాంగిల్ లో చూస్తే హృతిక్ రోషన్-కంగన మధ్య వివాదాలు తలెత్తిన ప్పుడు వాటిని సెటిల్ చేసే బాధ్యత జావేద్ తీసుకున్నారా? అన్నది మరో సందేహంగా తెరపైకి వస్తుంది.

కంనగ-హృతిక్ కొన్నాళ్ల పాటు రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరి మధ్య వివాదాలు రావడంతో దూరమ్యారు. ఈ నేపథ్యంలో హృతిక్ మోసం చేసాడని కంగన సంచలన ఆరోపణలు చేసింది. వ్యవహారం కోర్టు వరకూ వెళ్లింది. ఈనేపథ్యంలో 2020లో ఓ ఇంటర్వ్యూలో హృతిక్ తో వివాదం గురించి స్పందించింది. ఆ సమయం లోనే జావెద్ ఇంటికి పిలిపించి బెదిరించారని ఆరోపించింది. దీంతో జావెద్ ఆమె పై పరువు నష్టం దావా వేసారు.