మహేష్ రాజమౌళి మూవీ మొదటి ముహూర్తం ఖరారు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను మహేష్ బాబు చేస్తున్న విషయం తెల్సిందే. మరో వైపు రాజమౌళి నేటి వరకు కూడా ఆర్ఆర్ఆర్ నాటు నాటును ఆస్కార్ అవార్డుల ప్రమోషన్ లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే.

మరో వారం పది రోజుల పాటు నాటు నాటు హడావుడిలోనే రాజమౌళి ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే మహేష్ బాబు కోసం స్క్రిప్ట్ వర్క్ ను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రెడీ చేసే పనిలో ఉన్నారట. త్వరలోనే మహేష్ బాబు.. రాజమౌళి జాయిన్ అయ్యి స్క్రిప్ట్ పై చర్చలు జరుపబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ఆగస్టు నెలలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ సినిమా యొక్క పూజా కార్యక్రమాలకు మొదటి ముహూర్తం ఖరారు అయ్యిందనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఇప్పటి వరకు స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాకుండానే సినిమాకు సంబంధించిన అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

హీరోగా మహేష్ బాబు ఇమేజ్ ను పాన్ ఇండియా స్థాయిని మించేలా జక్కన్న ఈ సినిమాను తీస్తాడని అభిమానులు చాలా ధీమాతో ఉన్నారు. రాజమౌళి సినిమా అంటే వెయ్యి కోట్లు అనే అభిప్రాయం పడిపోయింది. కనుక అయిదు వందల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమా కోసం విజయేంద్ర ప్రసాద్ రెడీ చేసిన కథ లో హీరోయిన్ గా దీపిక పదుకునే అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుందట. అయితే ఇప్పటి వరకు ఆ విషయం క్లారిటీ లేదు. మహేష్ బాబు హీరోగా రాజమౌళి కాంబో సినిమా ఎప్పుడో ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా ఏవో కారణాల వల్ల వాయిదా వేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు ప్రారంభం కు సిద్ధం అయ్యింది.