మృణాల్‌ తెలివైన నిర్ణయం అదుర్స్‌

హిందీ సీరియల్స్ తో ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ లో అడుగు పెట్టింది. అక్కడ ఆశించిన స్థాయిలో హిట్స్‌ పడలేదు. హిందీలో హిట్‌ కోసం కిందా మీదా పడుతున్న సమయంలో అనూహ్యంగా తెలుగు లో సీతారామం లో నటించే ఛాన్స్ దక్కించుకుని సూపర్‌ హిట్ ను సొంతం చేసుకుంది.

సీతారామం హిట్ అవ్వడం మాత్రమే కాకుండా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆ సినిమా తెలుగు ప్రేక్షకుల్లోనే కాకుండా తమిళ ప్రేక్షకుల్లో కూడా మృణాల్‌ కి గుర్తింపు తెచ్చి పెట్టింది. తాజాగా హాయ్ నాన్న సినిమాతో మరో హిట్ దక్కించుకుని విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఒక వైపు తెలుగు లో క్రేజీ సినిమాల్లో నటిస్తూ మరో వైపు తమిళ ఎంట్రీకి రెడీ అయ్యింది. ఇప్పటికే కమల్‌ హాసన్ నిర్మాణంలో శింబు హీరోగా రూపొందుతున్న సినిమాలో ఒక హీరోయిన్ గా మృణాల్‌ ఎంపిక అయ్యింది. అంతే కాకుండా శివ కార్తికేయన్ సినిమాలో కూడా ఈ అమ్మడు హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా తమిళ స్టార్‌ హీరో అజిత్ నటించబోతున్న ఓ భారీ చిత్రంలో కూడా ఈ అమ్మడు నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఈ అమ్మడు టాలీవుడ్‌ లో కంటే కోలీవుడ్‌ లో మరిన్ని మంచి ఆఫర్లు దక్కించుకుంటుంది.

తెలుగు లో మాత్రమే సినిమాలు చేయాలి అనే ఆలోచన కాకుండా తమిళనాట కూడా సినిమాలు చేయాలని నిర్ణయించుకోవడం మంచి నిర్ణయం అన్నట్టు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సౌత్‌ లో ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూనే బాలీవుడ్‌ లో కూడా ప్రయత్నాలు చేస్తోంది.