రణ‌బీర్ త‌న రియ‌ల్‌ తండ్రితో అలాగే ఉండేవాడా?

రణబీర్ కపూర్ రిషి కపూర్ యొక్క నష్టాన్ని ఇంకా ‘అర్థం చేసుకోలేదు’: “తల్లిదండ్రులను కోల్పోవడం ఎల్లప్పుడూ ఒక వ్యక్తి జీవితంలో అతిపెద్ద తక్కువ అని నేను భావిస్తున్నాను”

తన తండ్రి దివంగత రిషి కపూర్‌ను కోల్పోయిన విషయాన్ని తాను ఇంకా పరిష్కరించలేదని రణబీర్ కపూర్ అన్నారు. ప్రముఖ నటుడు క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం తర్వాత 2020లో కన్నుమూశారు.

ర‌ణ‌బీర్ క‌పూర్ న‌టించిన యానిమ‌ల్ ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ ట్రైల‌ర్ లో తండ్రి కొడుకుల ఎమోష‌న‌ల్ జ‌ర్నీ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ట్రైల‌ర్ లో ర‌ణబీర్‌- అనీల్ క‌పూర్, ర‌ణ‌బీర్ – ర‌ష్మిక ల మధ్య లోతైన సున్నిత‌మైన‌ సంభాషణలు హృద‌యాల‌ను కొల్ల‌గొట్టాయి. టీమ్ యానిమల్ తమ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో వేగం పెంచ‌డంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. పూర్తి నిడివి గల ట్రైలర్‌తో పాటు హువా మైన్-సత్రాంగ-పాపా మేరీ జాన్- అర్జున్ వాయిలీ.. అనే నాలుగు పాటలు విడుదలయ్యాయి. ఇటీవ‌ల‌ రణబీర్ కపూర్, రష్మిక మందన్న, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నందమూరి బాలకృష్ణ తెలుగు చాట్ షో అన్‌స్టాపబుల్‌తో NBKలో సినిమాని ప్రమోట్ చేసారు. ఈ ఎపిసోడ్ ఇప్ప‌టికే ఆహా ఓటీటీలో ప్రసారం అయింది.

యాధృచ్ఛికంగా ర‌ణ‌బీర్ క‌పూర్ త‌న తండ్రిని కోల్పోయి ఇప్ప‌టికే రెండేళ్లు పైగా అయింది. ఇంకా అత‌డు ఈ విష‌యంలో ఎంతో ఎమోష‌న‌ల్ గా ఉన్నాడు. ఇంత‌లోనే తండ్రి కొడుకుల క‌థ‌లోనే అత‌డు న‌టించాల్సి వ‌చ్చింది. అయితే రణబీర్ కపూర్ త‌న తండ్రి రిషి కపూర్ ని కోల్పోయిన‌ నష్టాన్ని ఇంకా `అర్థం చేసుకోలేదు`.. అన్న చ‌ర్చా వేడెక్కిస్తోంది. అయితే దీనికి ర‌ణ‌బీర్ స్పంద‌న ఆస‌క్తిని క‌లిగించింది.

ఎన్బీకేతో చాట్ షోలో రణబీర్ కపూర్ తన తండ్రి దివంగత రిషి కపూర్‌ను కోల్పోయిన విషయాన్ని ఇంకా ప్రాసెస్ చేయలేదని చెప్పాడు. రిషీజీ క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం చేసిన‌ తర్వాత 2020లో కన్నుమూశారు. నందమూరి బాలకృష్ణతో మాట్లాడుతూ, రణబీర్ ఇలా అన్నాడు. “తల్లిదండ్రులను కోల్పోవడం అనేది ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడూ అతి పెద్ద -లో ఫేజ్ అని నేను భావిస్తున్నాను. కాబట్టి రెండేళ్ళ క్రితం నేను మా నాన్నను కోల్పోయినప్పుడు… ఆ నష్టాన్ని ఇంకా అర్థం చేసుకోలేదని నేను అనుకోను. ఎందుకంటే నాన్న‌కు కొడుకుని అని తెలుసు కాబట్టి… నేను పుట్టినప్పటి నుండి, ఎప్పుడూ దృఢంగా ఉండటమే నేర్పించారు. మీరు (కొడుకు) మ‌న‌సులో ఉన్న‌ది వ్యక్తపరచరు.. ఎక్కువ చెప్పరు. కాబట్టి నేను నిజంగా నా తండ్రి నష్టాన్ని నాకో లేదా నా ప్రియమైనవారికో చెప్పానో లేదో నాకు తెలియదు“ అని అన్నారు. రణబీర్ తన తండ్రిని కోల్పోవడం తనను పరిపక్వ ద‌శ‌కు చేర్చింద‌ని, ఇదే కాకుండా జీవితంలో `మరింత బాధ్యత`గా మార్చిందని ఒప్పుకున్నాడు.

యానిమల్‌లో అనిల్ కపూర్ తండ్రి పాత్ర‌ను పోషించారు. అయితే తండ్రితో కొడుకు గందరగోళ సంబంధాన్ని ట్రైల‌ర్ ఆవిష్క‌రించింది. ఇదే విషయం గురించి రణబీర్ మాట్లాడుతూ, “తండ్రీ కొడుకుల మధ్య చాలా బలమైన భావోద్వేగం ఉంటుంది. నేను నిజంగా కనెక్ట్ చేసిన బేస్ (పునాది ఎలిమెంట్) ఇది అని నేను అనుకుంటున్నాను. ఎదుగుతున్నప్పుడు, నేను మా నాన్నతో చాలా సన్నిహితంగా లేను.. ఎందుకంటే మా నాన్న… మా నాన్నతో నా సంబంధం అతని తండ్రితో ఎలా ఉందో అలానే ఉంది. చాలా ప్రేమ గౌరవం మామ‌ధ్య ఉన్నాయి.. కానీ దూరం ఉంది“ అని అన్నారు.

ఎక్కడో భారతదేశంలోని తండ్రీ కొడుకుల కెమిస్ట్రీ కొంచెం ఒక‌రికొక‌రు దూరంగా పాచిక వేసిన‌ట్టుగా ఉంటుంది. ప్రేమ గౌర‌వం ఉన్నా దూరం ఉంటుంది.. నేను కథలోని ఆ భాగానికి నిజంగా కనెక్ట్ అయ్యాను అని ర‌ణ‌బీర్ అన్నారు. భూషణ్ కుమార్ – క్రిషన్ కుమార్ ల‌కు చెందిన‌ టి-సిరీస్, మురాద్ ఖేతాని సినీ1 స్టూడియోస్ .. ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్రైమ్ డ్రామా జానర్‌లో యూనిక్ థాట్ తో వ‌స్తోంది. 1 డిసెంబర్ 2023న విడుదల కానుంది.