రెండు ద‌శాబ్ధాల త‌ర్వాత రేణు దేశాయ్!

రేణు దేశాయ్ మ్యాక‌ప్ వేసుకుని రెండు దాశాబ్ధాల‌వుతుంది. చివ‌రిగా ‘జానీ’ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న న‌టించారు. ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో జీవితాన్ని పంచుకోవ‌డంతో ఆమె వెండి తెర‌కు దూర‌మ్యారు. కొన్నేళ్ల కాపురం అనంత‌రం ఆ బంధం వీగిపోవ‌డం తెలిసిందే. అటు రేణు దేశాయ్ కొత్త ప్ర‌యాణం విధిత‌మే.ఆ త‌ర్వాత టెలివిజ‌న్ షోస్ హోస్ట్ చేయ‌డం..’ఇష్క్ వాలా’ సినిమా తో త‌న‌లో ద‌ర్శ‌కుల్ని ప‌రిచ‌యం చేసారు. దీంతో రేణు ఆ ర‌కంగా బిజీ అవుతార‌ని అంతా భావించారు.

కానీ అక్క‌డా ఆమె స‌క్సెస్ అవ్వ‌లేదు. పూణేలో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నేప‌థ్యంలో అక్క‌డే ఉండి వ్యాపారా లు..ద‌ర్శ‌కురాలిగా కొన‌సాగుతుంద‌ని అనుకున్నారు. కానీ ఆమె ఎక్క‌డికి వెళ్లినా రేణు టాలీవుడ్ ని మాత్రం విడిచిపెట్ట‌లేదు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ప్ర‌త్య‌క్షంగానో..ప‌రోక్షంగానో మాట్లాడుతూనే ఉన్నారు. ఓవైపు ప‌వ‌న్ అభిమాను ల‌నుంచి వ్య‌తిరేక‌త ఉన్నా అవెక్క‌డా ప‌ట్టించుకో కుండా ప‌వ‌న్ ప‌ట్ల సానుకూలంగానే ఆమె స్పందిస్తున్నారు.

ఇలా ర‌క‌ర‌కాల జ‌ర్నీ అనంత‌రం మ‌ళ్లీ ఆమె రెండు దశాబ్దాల త‌ర్వాత ముఖానికి రంగు వేసుకుంటున్నారు. మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తోన్న ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’ సినిమాలో ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. వంశీకృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ‌రి రేణు దేశాయ్ కి సినిమాలో పాత్ర పరంగా ఎలాంటి బాధ్య‌త‌లు అప్ప‌గించారు అన్న‌ది చూడాలి. అలాగే ఈ ప్రాజెక్ట్ లోకి రేణు దేశాయ్ ని తీసుకోవాలి? అన్న ఆలోచ‌న ఎవ‌రిది?అన్న‌ది ముఖ్య‌మే.
ఎందుకంటే ‘జానీ’ త‌ర్వాత ఆమెకి చాలా అవ‌కాశాలు వ‌చ్చాయి. ప‌వ‌న్ కళ్యాన్ కి దూర‌మైన త‌ర్వాత న‌టించ‌మ‌ని చాలా మంది మేక‌ర్స్ కోరారు. కానీ ఆమె ఏ సినిమా చేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో ర‌వితేజ సినిమాలో న‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఆమెని ఈ సినిమా కోసం ఎవ‌రు ఒప్పించారు అన్న‌ది ఇంట్రెస్టింగ్ .

నేరుగా ర‌వితేజ‌నే న‌టించ‌మ‌ని అడిగి ఉంటార‌ని చాలా మంది భావిస్తున్నారు. కోరిక ఎవ‌రిదైనా రేణు దేశాయ్ ఈ సినిమాతో కంబ్యాక్ అవ్వ‌డం విశేషం. సెకెండ్ ఇన్నింగ్స్ కొంగొత్త‌గా సాగిపోవాల‌ని ఆశిద్దాం. అమ్మ‌..అక్క ..వ‌దిన పాత్ర‌ల‌కు రేణు దేశాయ్ ప‌ర్పెక్ట్ ఛాయిస్ గా నిలుస్తారు.