లావణ్య వినయ విధేయత కి మెగా ఫ్యాన్స్ ఫిదా

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం వైభవంగా యూరప్ లో జరిగింది. అక్కడ జరిగిన పెళ్లికి మెగా ఫ్యామిలీ మెంబర్స్ దాదాపు అందరూ వెళ్లారు. అయితే ఇండస్ట్రీకి చెందిన మెగా ఫ్యామిలీ సన్నిహితులు మరియు మీడియా వారు పెళ్లికి హాజరు అవ్వలేక పోయారు. వారి కోసం ఆదివారం హైదరాబాద్ లో మెగా ఫ్యామిలీ భారీ వివాహ రిసెప్షన్ ను ఏర్పాటు చేయడం జరిగింది.

రిసెప్షన్ లో చిరంజీవి నుంచి మొదలుకుని ఎంతో మంది సినీ ప్రముఖులు, మీడియా వర్గాల వారు మరియు రాజకీయ నాయకులు హాజరు అయ్యారు. వరుణ్‌ తేజ్ మరియు లావణ్య త్రిపాఠిలకు వచ్చిన గెస్ట్‌ లు అంతా కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రేమ జంట రిసెప్షన్ లో సూపర్ ఔట్‌ ఫిట్ లో కన్నుల విందు చేశారు.

ఇదే సమయంలో లావణ్య త్రిపాఠి వినయ విధేయత కి మెగా ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. పెద్ద వారి పట్ల, తన గురువు పట్ల లావణ్య త్రిపాఠి చూపించిన గౌరవ మర్యాదలకు అంతా కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. చిరంజీవి వచ్చిన సమయంలో లావణ్య త్రిపాఠి కాళ్లకు దండం పెట్టి మరీ మెగాస్టార్‌ వద్ద ఆశీర్వాదం తీసుకుంది. కాళ్లు మొక్క వద్దని చిరంజీవి వారిస్తున్నా కూడా కొత్త జంట కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.

చిరంజీవి వచ్చిన సమయంలోనే కాకుండా తన గురువు సత్యానంద్‌ వచ్చిన సమయంలో కూడా లావణ్య త్రిపాఠి కాళ్లు మొక్కి తన కృతజ్ఞత ను తెలియజేసి ఆశీర్వాదం తీసుకుంది. మొత్తానికి లావణ్య చూడ్డానికి చాలా అందంగా కనిపించడం తో పాటు, ఒక స్టార్ ని అనే భావన లేకుండా పెద్దల పట్ల గౌరవం ను కనబర్చడం నిజంగా గొప్ప విషయం అన్నట్లుగా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.