సింగిల్ ఫ్రేమ్‌ లో మెరిసిన స్టార్‌ హీరోల శ్రీమతులు

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఇద్దరు ముగ్గురు సింగిల్‌ ఫ్రేమ్‌ లో కనిపించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్‌ లు తరుచూ కలిసి కనిపిస్తూ ఉన్నారు. అయితే అప్పుడప్పుడు వారితో పాటు మహేష్ బాబు కూడా కనిపిస్తున్నాడు.

తాజాగా దీపావళి సందర్భంగా రామ్‌ చరణ్ ఇంట భారీ వేడుక నిర్వహించారు. ఆ వేడుకలో పలువురు స్టార్‌ హీరోలు ఇంకా ఇండస్ట్రీ ప్రముఖులు పాల్గొన్నారు. దీపావళి సందర్భంగా మహేష్‌ బాబు, రామ్‌ చరణ్‌, వెంకటేష్‌, ఎన్టీఆర్‌ లు కలిసి ఉన్న ఫోటో వారి ఫ్యాన్స్ కి కన్నుల విందు చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు స్టార్‌ హీరోల భార్యల ఫోటో వైరల్‌ అవుతోంది.

ఎన్టీఆర్‌, మహేష్ బాబు, అల్లు అర్జున్‌ మరియు రామ్‌ చరణ్‌ భార్యలు అయిన లక్ష్మీ ప్రణతి, నమ్రత, స్నేహా మరియు ఉపాసనలు సింగిల్‌ ఫ్రేమ్‌ లో కనిపించి కన్నుల విందు చేశారు. ఇలాంటి ఫ్రేమ్‌ ను మళ్లీ ఎప్పటికి చూస్తామో… ఇంత మంది స్టార్‌ హీరోల శ్రీమతులను సింగిల్‌ ఫ్రేమ్‌ లో చూడటం చాలా బాగుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఒకప్పుడు స్టార్‌ హీరోల మధ్య పోటీ తీవ్రంగా ఉండి, వ్యక్తిగతంగా కూడా విభేదాలు ఉండేవి. కానీ ఇప్పుడు పోటీ ఎంత ఉన్నా కూడా వ్యక్తిగతంగా మాత్రం చాలా స్నేహంగా కనిపిస్తున్నారు. మొత్తానికి టాలీవుడ్‌ లో ఇలాంటి అరుదైన కలయికల్లో ఫోటోలు సోషల్‌ మీడియా ద్వారా రావడం ఫ్యాన్స్ కి ఆనందంను కలిగిస్తోంది.