కోవిద్ పేషెంట్లకు తనదైన సాయం ప్రకటించిన అలియా భట్

బాలీవుడ్ టాప్ నటి అలియా భట్ కరోనా బాధితులకు సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఇటీవలే కరోనా నుండి కోలుకున్న అలియా భట్ ప్రియుడు రన్బీర్ కపూర్ తో కలిసి మాల్దీవ్స్ ట్రిప్ కు వెళ్ళొచ్చింది. ఆ తర్వాత కరోనా బాధితుల కోసం సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ ను షేర్ చేసింది అలియా భట్.

జర్నలిస్ట్ ఫయే డిసౌజాతో కలిసి కోవిద్ పేషెంట్లపై వివరాలు సేకరించాక అవసరమైనంత సహాయం చేస్తానని తెలిపింది. దీనికి తగ్గ బ్యాక్ గ్రౌండ్ వర్క్ ను ఇప్పటికే మొదలుపెట్టారు కూడా. అంతే కాకుండా ముంబైలో హాస్పిటల్స్, బెడ్స్, అంబులెన్స్ సర్వీస్, హెల్ప్ లైన్ నెంబర్ల వివరాలను అభిమానులతో షేర్ చేసుకుంది. బెంగళూరు, కోల్కతా హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఆమె షేర్ చేసింది.

దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంటే కొంత మంది సెలబ్రిటీలు హాలిడే ట్రిప్స్ కు వెళ్లి ఎంజాయ్ చేయడంపై కొన్ని విమర్శలు వచ్చిన విషయం తెల్సిందే.