బిగ్ బాస్ 5: ఎన్నీ మాస్టర్ కు వచ్చిన షీల్డ్ ఏంటి?

బిగ్ బాస్ సీజన్ 5 ఏడు వారాలు పూర్తి చేసుకుంది. హౌజ్ నుండి ఎలిమినేట్ అయిన ఏడో కంటెస్టెంట్ గా ప్రియా నిలిచింది. అయితే అంతకంటే ముందు సన్ డే, ఫన్ డే గా మార్చాడు నాగార్జున. ముందుగా హౌజ్ లో ఉన్న అందరి చేత ఒక గేమ్ ఆడించాడు. మూడు డిఫరెంట్ లెవెల్స్ లో జరిగిన ఈ గేమ్ లో ఎన్నీ మాస్టర్ విజయం సాధించారు. దానివల్ల ఆమె షీల్డ్ గెలుపొందారు.

ముందుగా హౌజ్ లో 13 మంది ఉండగా గ్రౌండ్ లో మొత్తం 11 పిల్లోస్ పెట్టారు. బజర్ మోగగానే అందరూ వెళ్లి పిల్లోస్ తీసుకోవాలి. తీసుకోలేని ఇద్దరూ ఎలిమినేట్ అయినట్లు. ఈ గేమ్ లో షణ్ముఖ్, కాజల్ ముందుగా ఎలిమినేట్ అయ్యారు. తర్వాత సినిమా క్విజ్ రౌండ్ జరిగింది. అందులో తప్పు చెప్పిన వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు. ఆ రౌండ్ లో జెస్సీ, ప్రియాంక, మానస్ లు ఎలిమినేట్ అయ్యారు.

ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ నుండి వాటర్ ను తీసుకొచ్చి టిన్స్ లో నింపాల్సి ఉంటుంది. ఈ టాస్క్ పూర్తయ్యే సరికి చివరిగా సన్నీ, శ్రీరామ్, ఎన్నీ మాస్టర్, విశ్వలు ఉన్నారు. నాగార్జున ఆ తర్వాత మ్యూజికల్ చైర్స్ ఆడించగా సిరి, సన్నీలు ఎలిమినేట్ అయ్యారు. ఇక మిగిలిన ముగ్గురి మధ్యన కలర్ గేమ్ ఆడించాడు. అంటే కలర్ చెప్పగానే హౌజ్ లో నుండి ఏదో ఒక వస్తువును తీసుకురావాలి. ఇందులో శ్రీరామ్ చంద్ర ఎలిమినేట్ అయ్యాడు. చివరిగా విశ్వ, ఎన్నీ మాస్టర్ మధ్య టాస్క్ జరగ్గా అందులో మాస్టర్ విన్ అయ్యి షీల్డ్ గెలుచుకున్నారు.

ఈరోజు ఎపిసోడ్ లో నామినేషన్స్ ప్రాసెస్ కూడా ఆసక్తికరంగా సాగింది. ప్రభావతి కోడి గుడ్డు సౌండ్ చేసి లోబోను సేవ్ చేసింది. ఆ తర్వాత రవి సేఫ్ అయినట్లు నాగార్జున తెలిపాడు. సిరి, జెస్సీ కూడా తర్వాత ప్రాసెస్ లలో సేఫ్ అవ్వగా చివరికి ఎన్నీ మాస్టర్, ప్రియాల మధ్య సస్పెన్స్ ఎలిమినేషన్ జరిగింది. ఇందులో ప్రియా ఎలిమినేట్ అయ్యారు.

ఆమె ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతూ హౌజ్ మేట్స్ కు ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చారు. అంటే హౌజ్ మేట్స్ అందరికీ మార్క్స్ ఇవ్వడం అన్నమాట. ఇందులో లోబో, కాజల్ లు తప్ప అందరికీ బాగానే మార్క్స్ ఇచ్చారు ప్రియా. ప్రియాంక, మానస్, ఎన్నీ మాస్టర్ లకు 10 కి 10 మార్కులు ఇచ్చారు. ఇక ఇంట్లో ఇప్పుడు 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.