బిగ్ బాస్ 5: త్రిమూర్తులు ఇక విడిపోయినట్లేనా?

బిగ్ బాస్ సీజన్ 5 లో మరో ఆసక్తికర ఎపిసోడ్ ముగిసింది. కెప్టెన్సీ టాస్క్ కోడిపెట్ట ముగిసింది. ఈ టాస్క్ లో రకరకాల మనస్తత్వాలు బయటపడ్డాయి. లోబో తిరిగి హౌజ్ లోకి వచ్చాడు. ఒకసారి హౌజ్ లో ఏం జరిగిందో చూసుకుంటే..

షణ్ముఖ్ జస్వంత్ ఈరోజు చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. జెస్సీకు ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చిన విషయం తెల్సిందే. దానికి సిరిను సహాయం కోసం ఎంచుకున్నాడు జెస్సీ. ఇద్దరూ కలిసి షణ్ముఖ్, ప్రియా, ప్రియాంకల గుడ్లు జీరో చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే జెస్సీ టాస్క్ ను సరిగా అర్ధం చేసుకోవడంలో విఫలమయ్యాడు. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాడు.

బిగ్ బాస్ చెప్పింది ముగ్గురి ఎగ్స్ ను జీరో చేయమని, జీరో చేసుకోమని అడగడం కాదు. సిరి వెళ్లి షణ్ముఖ్, ప్రియా, ప్రియాంకల ఎగ్స్ ను జీరో చేయమని బతిమాలింది. ఇక్కడే టాస్క్ ను ఓడిపోయాడు. సీక్రెట్ టాస్క్ లో విఫలమవడంతో జెస్సీను కెప్టెన్సీ టాస్క్ నుండి తప్పించాడు బిగ్ బాస్. ఇక్కడే షణ్ముఖ్ ట్రిప్ అయ్యాడు. జెస్సీ కోసం సిరి తన టాస్క్ ను ఆడటం మానేసింది. తన వద్ద కూడా తక్కువ ఎగ్స్ ఉన్నాయి. ఇక ప్రియా, ప్రియాంక, షణ్ముఖ్ ల ఎగ్స్ జీరో అయ్యాయి. ఇక్కడ ఐదుగురు కెప్టెన్సీ రేసు నుండి తప్పుకున్నారు.

ఇక టాస్క్ ను పూర్తిగా సక్సెస్ఫుల్ గా ఆడిన వారిలో మానస్, శ్రీరామ్ చంద్ర, సన్నీ, విశ్వ, రవి ఉన్నారు. వీరు ఐదుగురిని కెప్టెన్సీ టాస్క్ కు సెలెక్ట్ చేసాడు బిగ్ బాస్. ఆ తర్వాత లోబో ఇంట్లోకి వచ్చాడు. రెండు స్పెషల్ ఎగ్స్ ను బిగ్ బాస్ లోబోకు ఇచ్చి పంపించాడు. అందులో ఒకటి బ్లాక్. అది కెప్టెన్సీ రేసులో ఉన్న వారిని రేసు నుండి తప్పించేది. గోల్డెన్ ఎగ్ కెప్టెన్సీ రేసులో లేనివారిని ఉంచేలా చేస్తుంది. లోబో రాగానే ఈ రెండు ఎగ్స్ ను ఇవ్వాల్సి ఉంటుంది. లోబో బ్లాక్ ఎగ్ ను శ్రీరామ్ చంద్రకు ఇవ్వగా గోల్డెన్ ఎగ్ ను కాజల్ కు ఇచ్చాడు. అంటే కెప్టెన్సీ టాస్క్ లో ఇప్పుడు శ్రీరామ్ చంద్ర స్థానంలో కాజల్ ఉంది.

షణ్ముఖ్ తన ఎగ్స్ జీరో అవ్వడంతో పాటు హౌజ్ లో సరిగా టాస్క్ ఆడట్లేదని అందరూ అనుకుంటున్నారని తెగ ఫీల్ అయిపోయాడు. సిరి, జెస్సీ ఎంత చెప్పినా కానీ వినలేదు. సిరి అయితే చాలా సార్లు బతిమాలింది. మీరు నన్ను ఎదవని చేసారు అంటూ షణ్ముఖ్ వారిద్దరిపై నానా మాటలు అన్నాడు.