బిగ్ బాస్ 5: తమ వీడియోస్ తో ఎమోషనల్ అయిన శ్రీరామ్, మానస్

బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. చివరి వారంలోకి వచ్చేసింది. ఇప్పటికే ఐదుగురు ఫైనలిస్ట్స్ కన్ఫర్మ్ అయిన విషయం తెల్సిందే. మానస్, షణ్ముఖ్, సిరి, సన్నీ, శ్రీరామ్ చంద్రలు బిగ్ బాస్ సీజన్ 5 లో ఫైనల్స్ కు చేరారు. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఫైనలిస్ట్స్ అందరూ ఫైనల్ వీక్ లో తొలి రోజును బాగా ఎంజాయ్ చేసారు. ఐదుగురు గార్డెన్ ఏరియాలో కూర్చొని ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుకున్నారు. అలాగే సిరి ఇంగ్లీష్ పై కూడా కొన్ని పంచులు వేశారు. అలాగే సన్నీ తన తల్లి కోరికను తీర్చాలని, బిగ్ బాస్ కప్ ను కొట్టాలని మానస్ తో చెప్పుకున్నాడు.

ఇక బిగ్ బాస్ లాస్ట్ వీక్ లో ఎప్పుడూ జరిగే ఫైనలిస్ట్స్ జర్నీ వీడియోస్ మొదలయ్యాయి. ముందుగా శ్రీరామ్ చంద్ర జర్నీని ప్రెజంట్ చేసారు. మిగతా ఫైనలిస్ట్స్ ను బెడ్ రూమ్ లోనే ఉంచి శ్రీరామ్ ఒక్కడినే గార్డెన్ ఏరియాకు రమ్మని చెప్పాడు బిగ్ బాస్. అలాగే లివింగ్ రూమ్ లో గార్డెన్ ఏరియాలో శ్రీరామ్ జర్నీకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ను ఉంచారు. దీంతో శ్రీరామ్ చంద్ర వాటిని చూసి బాగా ఎంజాయ్ చేసాడు. ఇక గార్డెన్ ఏరియాలో ఉన్న పోడియంపై శ్రీరామ్ చంద్రను నిలబడమని తన జర్నీని చూపించారు. దానికంటే ముందు బిగ్ బాస్ శ్రీరామ్ చంద్ర గురించి చెప్పిన మాటలు తనకు కచ్చితంగా బూస్టప్ గా నిలుస్తాయి. శ్రీరామ్ ను లోన్ రేంజర్ గా అభివర్ణిస్తూ ఒక్కడివే, ఒంటరిగా ఇది సాధించావని చెప్పి అభినందించారు. ఇక శ్రీరామ్ జర్నీలో చాలా ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఎన్నో గొడవలు, సంతోషకరమైన రోజులు, ఇలా అన్నిటినీ కలుపుతూ చేసిన వీడియో నిజంగా ఎమోషనల్ గా సాగింది. దాని తర్వాత శ్రీరామ్ చంద్రను ఏదైనా ఒక ఫోటో తీసుకుని వెళ్ళమని చెప్పాడు బిగ్ బాస్.

తర్వాతి వంతు మానస్ ది. బిగ్ బాస్ 5లో తల్లి చాటు బిడ్డగా మొదలైన మానస్ ప్రయాణం ఇక్కడి దాకా రావడాన్ని బిగ్ బాస్ అభినందించారు. శ్రీరామ్ చంద్ర తరహాలోనే మానస్ కు కూడా ఫోటోగ్రాఫ్స్ పరంగా ఎమోషనల్ గా ఉండేలానే చూసుకున్నాడు. మొత్తంగా మానస్ తన జర్నీని చూసుకుని ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు. అలాగే వెనక్కి వచ్చి ఇది తనకు చాలా బూస్టప్ ఇచ్చిందని తెలిపాడు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో మిగతా వారి జర్నీస్ ఉంటాయి.