శంకర్‌, వడివేలు వివాదం ముగిసింది

స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ నిర్మాణంలో వడివేలు హీరోగా రూపొందిన సినిమా హింసించే 23వ రాజు పులకేసి. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకంఉది. దాంతో ఆ సినిమాకు సీక్వెల్‌ గా వడివేలు హీరోగా శంకర్‌ మొదలు పెట్టాడు. కథ విషయంలో వివాదం రావడంతో మద్యలో వడివేలు సినిమాను వదిలేశాడు. దాంతో శంకర్ నిర్మాతల మండలిని ఆశ్రయించాడు. తనకు రెండు కోట్ల నష్టం వాటిల్లిందని ఆ మొత్తంను తిరిగి ఇప్పించాలంటూ నిర్మాతల మండలిని కోరాడు. ఆ వివాదంతో వడివేలు ఇండస్ట్రీకి కూడా కొన్నాళ్లు దూరం అయ్యాడు. మళ్లీ ఇన్నాళ్లకు వడివేలు తో శంకర్ రాజీ కుదిరింది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తమిళ నిర్మాత ఒకరు వీరిద్దరి మద్య రాజీ కుదిర్చారట. వడివేలు రెండు కోట్ల రూపాయలు చెల్లించేందుకు ఒప్పుకున్నాడా లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. కాని ఇద్దరి మద్య వివాదం ముగిసినట్లుగా తమిళ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి. శంకర్ మరియు వడివేలు కాంబోలో సినిమా లు మళ్లీ వస్తాయా అంటే కొందరు వస్తాయనే నమ్మకంతో వ్యక్తం చేస్తున్నారు.