90 ఎంఎల్‌ సీఎం కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. హుజూరాబాద్‌ లో ఈటెల రాజేందర్‌ చేస్తున్న పాదయాత్రలో భాగంగా బండి సంజయ్ పాల్గొన్నాడు. ఆ సందర్బంగా కేసీఆర్ గురించి బండి సంజయ్‌ మాట్లాడుతూ ఆయన 90 ఎంఎల్‌ పడ్డ ప్రతి సారి మాట మారుస్తూ ఉంటాడు. ఆయన పెగ్గు వేసిన ప్రతి సారి మాటలు మారుస్తూ జనాలను మభ్య పెడుతున్నాడు అంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఒక్క పెగ్‌ వేసిన సమయంలో ఇంటికో ఉద్యోగం అంటాడు.. ఇంకో పెగ్‌ వేస్తే డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇస్తానంటాడు.. మూడవ పెగ్గుకు మరో హామీ ఇస్తాడు. ఇలా ఆయన హామీలు పెగ్గు పెగ్గుకు మారుతూ ఉంటాయి. అందుకే కేసీఆర్ 90 ఎంఎల్‌ సీఎం. అలాంటి పార్టీకి ఓట్లు వేయడం తెలంగాణ కు ముందు ముందు బతుకు ఉండదు అంటూ బండి సంజయ్ అన్నాడు. ఎన్నికలు రావడంతో దళిత బంధు అంటూ కొత్త డ్రామాను ఆయన మొదలు పెట్టాడు. కేసీఆర్‌ చెప్పేవి అన్ని అబద్దాలే. కనుక ఏ ఒక్కరు నమ్మవద్దంటూ బండి సంజయ్‌ హుజూరాబాద్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేశాడు.