క్రేజ్ ఉన్న హీరోయిన్లపై నితిన్ కన్ను

యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలను విడుదల చేసాడు. చెక్, రంగ్ దే చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేదు. మూడో సినిమాను ఈ ఏడాది విడుదల చేస్తాడు. బాలీవుడ్ రీమేక్ అంధధూన్ చిత్రాన్ని మేస్ట్రో పేరుతో రీమేక్ చేసిన విషయం తెల్సిందే.

ఈ చిత్రం డైరెక్ట్ ఓటిటిలో విడుదల కాబోతోంది. ఇక నితిన్ ఈ ఏడాది మరో రెండు చిత్రాలను లాంచ్ చేయనున్నాడు. అందులో ఒకటి వక్కంతం వంశీ దర్శకత్వంలో చేస్తాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజ హెగ్డేను అనుకుంటున్నారు.

అయితే ఆమెను ఇంకా సంప్రదించలేదు. పూజ హెగ్డే ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. మరి ఆమె ఓకే చేస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతం నితిన్ టాప్ హీరోయిన్స్ తో వర్క్ చేయడానికి చూస్తున్నాడు. భీష్మలో రష్మికతో, చెక్ లో రకుల్ ప్రీత్ తో, రంగ్ దే లో కీర్తి సురేష్ తో వర్క్ చేసాడు నితిన్.