తారక్.. భన్సాలీ.. వర్కౌట్ అవుతుందా?

ప్రస్తుతం తెలుగు హీరోలందరూ ప్యాన్ ఇండియా బాట పడుతున్నారు. ఒకరిద్దరు అన్నది లేకుండా ప్రతీ ఒక్కరూ ప్యాన్ ఇండియా హీరో అనిపించుకోవాలని ఆశిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ అందరికంటే ముందుగా ప్యాన్ ఇండియా హీరో అవ్వడమే కాకుండా బాలీవుడ్ దర్శకులతో సినిమాలు కూడా చేస్తున్నాడు.

ఇదే కోవలో ఎన్టీఆర్ కూడా వెళ్తున్నాడని తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ కు కూడా ప్యాన్ ఇండియా ఇమేజ్ వస్తుంది. ఆ తర్వాత బాలీవుడ్ దర్శకులతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే దానికంటే ముందు టాప్ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీల భన్సాలీ నుండి ఎన్టీఆర్ కు సినిమా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

భారీ చారిత్రక నేపధ్యమున్న సినిమాలకు పెట్టింది పేరైన భన్సాలీ రీసెంట్ గా ఎన్టీఆర్ తో వీడియో కాల్ కూడా మాట్లాడాడని అంటున్నారు. మరి ఈ కాంబినేషన్ వినడానికి ఆసక్తికరంగానే ఉన్నా ఎంత వరకూ వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి.